ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు తన స్వగృహంలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు.ఆయన సతీమణి చంద్రబాబు ప్రచారానికి ఎదురొచ్చి ప్రారంభించారు.
ఈ రోజు టిడీపీలో వెంకటేశ్వర స్వామి దర్శనం అనంతరం చంద్రబాబు సేవామిత్రతో పాటు టీడీపీ కార్యకర్తలతో చర్చించి ఎన్నికల ప్రచారం కోసం దిశానిర్దేశం చేస్తారు.అనంతరం తన ఎన్నికల ప్రచారం మొదలుపెట్టబోతున్నారు.
ఇదిలా ఉంటే ఈ ఎన్నికల ప్రచారంలో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు అభ్యర్ధుల తుది జాబితాని ప్రకటించేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తుంది.
ఇప్పటికే మొదటి జాబితాలో మెజారిటీ అభ్యర్ధులని ప్రకటించిన చంద్రబాబు తుది జాబితాలో మిగిలి ఉన్న 48 నియోజకవర్గాల అభ్యర్ధులని ప్రకటించనున్నారని తెలుస్తుంది.
అలాగే మొత్తం 25 మంది ఎంపీ అభ్యర్ధులని కూడా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.ఈ రోజు సాయంత్రం అభ్యర్ధుల ప్రకటన టీడీపీ నుంచి వెలువడే అవకాశం ఉందని సమాచారం వినిపిస్తుంది.