సరిహద్దు వద్ద ఉద్రిక్తత! నియంత్రణ రేఖని క్రాస్ చేసిన పాకిస్తాన్ వార్ క్రాఫ్ట్స్!

పుల్వామ ఉగ్ర దాడి తర్వాత భారత్, పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న సంగతి అందరికి తెలిసిందే.పాకిస్తాన్ లో ఉగ్ర స్థావరాలపై భారత్ వైమానిక దాడులు చేసిన తర్వాత రెండు దేశాల మధ్య ఉద్రిక్తత మరింతగా పెరిగింది.

 Pakistan Aircrafts Cross The Border In Loc1-TeluguStop.com

ఇక పాకిస్తాన్ లో ఉగ్రవాద స్థావరాలపై భారత్ వైమానిక దాడులని సహించలేకపోయిన పాకిస్తాన్ ఇండియాపై కాలు దువ్వె ప్రయత్నం చేసింది.అయితే వారి కుట్రలని భారత్ ఆర్మీ సమర్ధవంతంగా తిప్పి కొడుతూ వచ్చింది.

అదే సమయంలో దౌత్య పరంగా పాకిస్తాన్ పై తీసుకొచ్చిన ఒత్తిడికి ఆ దేశం భయపడక తప్పలేదు.

ఇదిలా వుంటే ప్రస్తుతం దేశ వ్యాప్తంగా ఎన్నికల వేడి అలుముకుంది.

ఇలాంటి టైంలో ఉగ్ర వాదుల నుంచి, అలాగే పాకిస్తాన్ ఆర్మీ నుంచి ఎదురు దాడులు ఎదురయ్యే అవకాశం ఉందని నిఘా వర్గాల నుంచి కూడా ఇప్పటికే హెచ్చరికలు వచ్చాయి ఈ నేపధ్యంలో సరిహద్దు వెంబడి భద్రతా దళాలు నిరంతరం గస్తీ కాస్తూ ఉన్నాయి.ఉగ్రకదలికలు ఉన్నట్లు అనుమానం వచ్చిన మరుక్షణం దాడులు చేస్తున్నాయి.

ఇదిలా వుంటే తాజాగా నియంత్రణ రేఖ వద్ద పూంచ్ సెక్టార్ లో పాకిస్తాన్ యుద్ధ విమానాలు పది కిలోమీటర్ల లోపలి చొచ్చుకు రావడం గమనించిన భారత రాడార్లు సైన్యాన్ని అప్రమత్తం చేసింది.అదే సమయంలో విమానాలు పెద్ద శబ్దం చేయడంతో సరిహద్దులో ఆర్మీ హై అలెర్ట్ ప్రకటించింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube