నటుడు, కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది.ఇంట్లో విలువైన ఆభరణాలు, వస్తువులు ఎవరో దొంగతనం చేసారని మోహన్ బాబు మేనేజర్ బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఈ రోజు ఫిర్యాదు చేసారు.
ఇంట్లో ఎవరు లేని సమయంలో దొంగతనంకి పాల్పడ్డారని ఫిర్యాదులో పేర్కొన్నారు.ఈ దొంగతనం ఇంట్లో పనివాల్లె చేసారని అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు మోహన్ బాబు తరుపున ఆతని మేనేజర్ ఫిర్యాదులో పేర్కొన్నారు.
జూబ్లీహిల్స్ ఫిలిం నగర్ లో మోహన్ బాబు ఇల్లు వుంది.అందులోనే దొంగతనం జరిగిందని బంజారాహిల్స్ పీసి లో ఫిర్యాదు చేసారు.ఇక ఫిర్యాదు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపడతామని చెప్పారు.ఈ దొంగతనంకి పాల్పాడింది బయటివారా లేక ఇంట్లో పనివాళ్ళ అనే విషయాలని విచారణలో తెలుసుకుంటామని పోలీసులు తెలియజేసారు.