అమెరికాలో నకిలీ విద్యార్ధి వీసాలతో ప్రవేశించిన వందల మంది విద్యార్ధులని అమెరికా నిభందిచిన విషయం అందరికి తెలిసిందే.ఫర్మింగ్టన్ పేరిట ఓ నకిలీ వర్సిటీ సృష్టించి విద్యార్థుల ప్రవేశాలను ఆహ్వానించారు.
విద్యార్ధులు ఎవరూ కూడా క్లాసులకి హాజరు అవుతామని చెప్పినా సరే అవసరం లేదని నమ్మబలికి అధిక మొత్తంలో ఫీజులని చెల్లించేలా చేశారు.
ఇదిలాఉంటే అమెరికాలో తాత్కాలిక నివాసాల కోసం విద్యార్థులకు ఎఫ్-1 వీసాలు అందజేశారు.అమెరికా ఇమ్మిగ్రేషన్ అధికారుల్లో బలైపోయిన వారిలో అత్యధికంగా భారతీయ విద్యార్ధులు ఉన్నారు.విద్యార్థులను యూనివర్సిటీ లలో చేర్చిన వారిపై ఎటువంటి చర్యలు చేపట్టకుండా విధ్యర్దులపైనే కేసులు బనాయిస్తున్నారు.
మోసపోయిన విధ్యార్డులపైనే ఇమ్మిగ్రేషన్ కేసులు బనాయించి వారిని జిల్లాలో మగ్గేలా చేయడం ఎంతో దారుణం అంటున్నాయి భారతీయ సంఘాలు.వందల మంది విద్యార్ధులు ఇప్పుడు అమెరికా జైళ్లలో మగ్గుతూ న్యాయసాయం కోసం వేడుకునే పరిస్థితిలో ఉన్నారు.
తాజా వార్తలు