రైతులకు పండగలాంటి వార్త చెప్పిన ఆర్బీఐ

రైతులకు ఆర్బీఐ పండుగలాంటి వార్తను చెప్పింది.మానిటరీ పాలసీలో రైతులకు పెద్ద బహుమానాన్ని ప్రకటించింది.

 Rbi Raises Collateral Free Farm Loan Limit-TeluguStop.com

రైతులకు ఇచ్చే రుణాల మొత్తాన్ని పెంచేసింది.రైతులకు గ్యారంటీ లేని రుణం మొత్తాన్ని రూ.1 లక్ష నుంచి రూ.1.6 లక్షలకు పెంచింది.2010లో రైతులకు పూచీ లేకుండా ఇచ్చే రుణంపై రూ.1 లక్ష పరిమితి విధించారు.కానీ 2010 తర్వాత ద్రవ్యోల్బణం చాలా పెరిగిందని వ్యవసాయంలో ఇన్ పుట్ వ్యయం కూడా పెరిగిన కారణంగా హామీ లేకుండా ఇచ్చే వ్యవసాయ రుణాల పరిమితిని పెంచాలని నిర్ణయించినట్టు ఆర్బీఐ ఒక ప్రకటనలో తెలిపింది.

రైతులకు అందించే గ్యారంటీ లేకుండా రుణాన్ని రూ.1 లక్ష నుంచి పెంచి రూ.1.6 లక్షలు చేసినట్టు పేర్కొంది.ఈ నిర్ణయంతో చిన్న, సన్నకారు రైతులకు ప్రయోజనం చేకూరుతుందని బ్యాంక్ చెప్పింది.దీనిని అమలు చేసేందుకు త్వరలోనే ఆర్బీఐ సర్క్యులర్ జారీ చేయనుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube