వైఎస్ ఆర్ బయోపిక్ ‘యాత్ర’ విడుదలకు సిద్దం అయ్యింది, రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం బడ్జెట్ దాదాపుగా రికవరీ అయినట్లే అంటూ చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.ప్రస్తుతం సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు.
భారీ అంచనాల నడుమ రూపొందిన ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో మరియు ఓవర్సీస్లో కలిపి మొత్తంగా 14 కోట్ల బిజినెస్ చేసినట్లుగా తెలుస్తోంది.ఇక ఆ రైట్స్, ఈ రైట్స్ అంటూ మరో ఆరు నుండి ఏడు కోట్ల వరకు వసూళ్లు దక్కించుకునే అవకాశం ఉంది.
టాలీవుడ్ వర్గాల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈ చిత్రం అన్ని ఏరియాల్లో కూడా ఊహించిన రేటు కంటే ఎక్కువ పలికింది.మొదట ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి లేదు.కాని సినిమా విడుదలకు సమీపిస్తున్న సమయంలో అనూహ్యంగా మంచి ప్రమోషన్స్ చేసి సినిమా స్థాయిని అమాంతం పెంచేశారు.ఆ కారణంగానే సినిమాను విడుదలకు ముందు అన్ని ఏరియాల్లో కూడా డిస్ట్రిబ్యూటర్లు మంచి రేటు పెట్టి కొనుగోలు చేశారు.
ఏరియాల వారిగా ఈ చిత్రం చేసిన బిజినెస్ వివరాలు ఇలా ఉన్నాయి :
నైజాం : 3.3 కోట్లు
సీడెడ్ : 2.21 కోట్లు
ఆంధ్ర : 5.50 కోట్లు
ఓవర్సీస్ : 2.0 కోట్లు
ఇతరం : 50 లక్షలు
మొత్తం : 13.51 కోట్లు
.తాజా వార్తలు