ఆడదానికి ఆడదే శత్రువు అనే సామెత ఉంది.అది కొన్ని సంఘటనలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది.
దేశంలో మొదటి సారి ఒక మహిళపై రేపు కేసు నమోదు అయ్యింది.అది కూడా ఒక అమ్మాయిని రేప్ చేసినందుకు అత్యంత బాధకరం మరియు విచారకరమైన ఈ సంఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అవుతోంది.
డిల్లీకి చెందిన అనుంగ్య(పేరు మార్చాం)ను శివాని అనే మహిళ రేప్ చేసింది.నడుముకు పురుషాంగం కట్టుకుని మరీ అనుంగ్యను శివానీ రేప్ చేసినట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడయ్యింది.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… ఈశాన్య రాష్ట్రం అయిన అరుణాచల్ ప్రదేశ్ నుండి ఉద్యోగం కోసం వచ్చిన అనుంగ్య ఎన్నో ఉద్యోగాలు చేసింది.చివరకు వ్యాపారం పెట్టుకునేందుకు నిర్ణయించుకుంది.బట్టల వ్యాపారం చేయాలనే ఉద్దేశ్యంతో ఆర్థిక సాయం కోసం ప్రయత్నించింది.బ్యాంకుల్లో లోనుకు ప్రయత్నించిన కూడా ఏమాత్రం ఫలితం లేకుండా పోయింది.దాంతో ఆమె సన్నిహితుల వద్ద ప్రయత్నాలు చేసింది.ఎంతో మందిని అడిగింది.
అలా శివాని ద్వారా పరిచయం అయ్యింది.శివాని ఆర్థిక సాయం చేస్తానంటూ మోసం చేసింది.
మొదట శివాని నుండి లైంగిక వేదింపులు ఎదుర్కొన్న అనుంగ్య ఆ తర్వాత మరింత హింసకు గురైంది.మెల్ల మెల్లగా అనుంగ్యను లోబర్చుకునేందుకు శివాని ప్రయత్నించింది.కాని అనుంగ్య మాత్రం మరో వ్యక్తితో సన్నిహితంగా మెలగడం ప్రయత్నించింది.
దాంతో శివానికి కోపం వచ్చి అనుంగ్యపై అఘాయిత్యంకు పాల్పడ్డట్లుగా పోలీసుల విచారణలో వెళ్లడయ్యింది.శివాని ఒక లెస్బియన్ అనే ప్రచారం జరుగుతుంది.కాని అనుంగ్య మాత్రం ఆమె తనపై కోసంతో అలా చేసిందని, ఆమె లెస్బియన్ కాదని చెబుతోంది.
ప్రస్తుతం ఆ విషయమై పోలీసులు ఎంక్వౌరీ చేస్తున్నారు.