దేశంలో ఉన్న అన్నదాతల పరిస్థితిపై కేంద్రం స్పందించింది.అందుకే దేశవ్యాప్తంగా… ఉన్న రైతుల స్థితిగతులను తెలుసుకుని వారికి మేలు చేకూర్చాలని కేంద్రం భావిస్తోంది.
దీనిలో భాగంగానే… సర్వే ద్వారా వివరాలు రాబట్టాలని చూస్తోంది.ఈ సర్వేలో ప్రధానంగా… రైతుల ఆదాయం, రుణభారం మొదలయిన అంశాల గురించి వివరాలు సేకరించాలని చూస్తున్నారు.
ప్రస్తుత కేలండర్ సంవత్సరంలో 77వ జాతీయ శాంపిల్ సర్వే కింద ‘వ్యవసాయ కుటుంబాల పరిస్థితి అంచనా సర్వే’ నిర్వహించనున్నట్టు వ్యవసాయశాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెఖావత్ లోక్ సభకు లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.ఈ సర్వే ద్వారా ‘దేశంలోని వ్యవసాయ కుటుంబాల పరిస్థితిని సమగ్రంగా అంచనా వేయడం జరుగుతుంది.వారి ఆదాయం, ఖర్చులు, రుణాలు, తదితర వివరాలన్నిటినీ ఈ సర్వేలో సేకరిస్తారని’ వ్యవసాయ మంత్రి తెలిపారు.
తాజా వార్తలు