గత నెలలో అమెరికాలోని కాలిఫోర్నియాలో 26 వ తేదీన అక్రమ వలసదారుడు చేసిన కాల్పుల్లో మరణించిన భారత సంతతి పోలీసు అధికారి అయిన రొనిల్ రోన్ సింగ్ మరణించిన విషయం అందరికి తెలిసిందే అయితే.అతడి మరణం ఎంతో మందిని కదిలించింది.
ఈ క్రమంలో బుధవారం ట్రంప్ తన అధికారిక నివాసం అయిన ఓవల్ ఆఫీస్ నుంచి తొలిసారి జాతినుద్దేశించి మాట్లాడారు.
క్రిస్మస్ పండుగని జరుపుకున్న మరుసటి రోజునే ఓ పోలీసు అధికారి హత్య కాబడటం ఎంతో భాధాకరం.అతడి మరణంతో అమెరికా గుండె పగిలింది అంటూ వ్యాఖ్యానించారు.అంతేకాదు ఇది కేవలం అక్రమంగా వలసలు వచ్చిన వారి వల్లే జరిగిందని అన్నారు.ఫిజీ నుంచి 2011లో వచ్చి , అమెరికా పోలీసు విభాగంలో చేరిన రొనిల్ సింగ్ ఎంతో ధర్యవంతుడు కూడా.
అయితే ట్రంప్ రొనిల్ రోన్ సింగ్, కుటుంబ సభ్యులను.
సహచర సిబ్బందిని పరామర్శించారు.ఈ పోలీసు అధికారి హత్యకి, మెక్సికో సరిహద్దు గోడ నిర్మాణానికి ఖచ్చితంగా సంభంధం ఉందని ట్రంప్ అన్నారు.
ప్రస్తుతానికి షట్ డౌన్ కొనసాగుతోందని.డెమోక్రాట్లు సహకారం ఇవ్వనందునే ఈ ఇబ్బందులని ట్రంప్ కామెంట్స్ చేశారు.