వైసీపీ గూటికి చేరిన గుర్నాథరెడ్డి !

వైసీపీ నుంచి టీడీపీ గూటికి చేరి.మళ్ళీ ఇప్పుడు టీడీపీ నుంచి వైసిపీలో చేరిపోయారు అనంతపురం మాజీ ఎమ్యెల్యే గుర్నాథరెడ్డి.

 Gurnadhareddy Join In Ysr Congress Party-TeluguStop.com

ఈయన గత కొంతకాలంగా టీడీపీ లో ఇమడలేకపోతున్నాను అంటూ… సంకేతాలు పంపుతున్నారు.ఈ మేరకు శ్రీకాకుళం జిల్లాలో పాదయాత్ర చేస్తున్న పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి.

ఆయన సమక్షంలో గురునాథ్‌రెడ్డి వైసీపీ గూటికి చేరిపోయారు.

.ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డికి జగన్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా గురునాథ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.

చంద్రబాబు పాలనలో ఆయన కుటుంబసభ్యులు, టీడీపీ నేతలే తప్ప ప్రజలెవరూ సంతోషంగా లేరని అన్నారు.ప్రత్యేక హోదా కోసం మొదటనుంచీ వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పోరాటం చేస్తుంటే.

చంద్రబాబు మాత్రం పూటకో మాట మార్చారని, నాలుగున్నరేళ్లుగా దోచుకోవడం తప్ప రాష్ట్రాభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదని విమర్శించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube