ప్రేమలో పడితే గుడ్డి వారు అవ్వడమే కాకుండా, పిచ్చి వారు, తెలివి తక్కువ వారు కూడా అవుతారని గతంలో పలు సార్లు నిరూపితం అయ్యింది.అయితే కొందరు కామంతో కళ్లు మూసుకు పోయిన వారు ప్రేమ పేరుతో తమను తాము మోసం చేసుకోవడంతో పాటు, ఇతరులను కూడా మోసం చేస్తు ఉంటారు.
ఎంతో దారుణమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు.పెళ్లి పీఠల మీది నుండి లేచి పోయిన వారిని, పెళ్లికి ముందు లేచి పోయిన వారిని కాస్త పర్వాలేదు అనుకోవచ్చేమో కాని, పెళ్లి అయిన వెంటనే లేచి పోయే వారిని ఏమనాలి.
తమిళనాడులో ఒక టీచర్ చేసిన పనికి ఏంత తిట్టినా తప్పులేదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే… తమిళనాడులోని సేలం ప్రాంతానికి చెందిన తిరువగౌండనూర్ గ్రామానికి చెందిన 26 ఏళ్ల యువతి పీజీ పూర్తి చేసి ఒక ట్యూషన్ సెంటర్ లో వర్క్ చేస్తూ ఉంది.ఇటీవలే సాఫ్ట్ వేర్ ఉద్యోగితో ఈమెకు పెళ్లి అయ్యింది.పెళ్లి అయిన వారం రోజుల తర్వాత అతడు ఉద్యోగ నిమిత్తం చెన్నై వేళ్లాడు.
అక్కడ ఇల్లు చూసుకుని వారం పది రోజుల్లో తిరిగి వచ్చేస్తానంటూ చెప్పి వెళ్లాడు.అయితే ఈలోపు ఆమె తన ప్రియుడితో జంప్ అయ్యింది.ఇంట్లో వారికి ఎంప్లాయిమెంట్ ఆఫీస్కు వెళ్లి వస్తానంటూ చెప్పి బయటకు వెళ్లింది.ఆమె ఎంత సేపటికి తిరిగి రాకపోవడంతో అనుమానం వచ్చిన తల్లిదండ్రులు వెదకడం ప్రారంభించారు.
రోజంతా వెదికిన తల్లిదండ్రులు మిస్సింగ్ కేసును నమోదు చేయడం జరిగింది.పోలీసులు కేసు నమోదు చేసుకుని ఆమెను వెదకడం ప్రారంభించారు.ఆ సమయంలోనే ఆమెకు ట్యూషన్ పాయింట్లో ఒక వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని పోలీసులు తెలుసుకున్నారు.ఆ లైన్ ద్వారా పోలీసులు ఎంక్వౌరీ చేయగా పూర్తి వివరాలు బయటకు వచ్చాయి.
16 ఏళ్ల వయసు కుర్రాడితో ఆమె లేచి పోయినట్లుగా పోలీసులు గుర్తించారు.బాలుడు మైనర్ అవ్వడం వల్ల వారిని కనిపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చారు.తనకంటే పదేళ్ల చిన్న వయస్సు కుర్రాడితో టీచర్ లేచి పోవడం పెద్ద సంచలనం అయ్యింది.
విద్యా బుద్దులు చెప్పి, ఉన్నతవంతంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన టీచర్ ఇలాంటి పని చేయడంతో స్థానికులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆమెను ప్రస్తుతం భర్త కూడా తీసుకు వెళ్లేందుకు ఆసక్తి చూపడం లేదు.భర్త ఆమె నుండి విడాకులు కోరుతున్నాడు.
మొత్తానికి ఆమె జీవితం ఎటు కాకుండా అయ్యింది.
తాజా వార్తలు