ఇప్పటివరకు తెలంగాణాలో జరిగిన పోలింగ్ సరళిని బట్టి వివిధ సంస్థలు ఎగ్జిట్ పోల్స్ విడుదల చేసాయి.అయితే అన్ని సర్వేలు … తెలంగాణాలో టీఆర్ఎస్ పార్టీకే మెజార్టీ ఉంది అని ప్రకటించగా… ఆ ఫలితాలకు పూర్తి భిన్నంగా ఆంధ్రా ఆక్టోపస్ లగడపాటి రాజగోపాల్ ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలపై మీడియా ముందు ప్రకటించాడు.
లగడపాటి రాజగోపాల్ సర్వే: మహాకూటమి 65 స్థానాలతో అధికారం చేపడుతుందని చెప్పారు.టీఆర్ఎస్ 35 స్థానాల్లో విజయం సాధిస్తుందని.ఒక 10 స్థానాలు అటుఇటు కావొచ్చని చెప్పారు.ఇక బీజేపీ 5 నుంచి 9, ఇండిపెండెంట్లు 5 నుంచి 9 స్థానాల్లో విజయం సాధిస్తారని చెప్పారు.
తెలంగాణలో మరోసారి కారుదే విజయమని టైమ్స్ నౌ, సీఎన్ఎక్స్ అంచనా వేసింది.టీఆర్ఎస్ 66 స్థానాల్లో విజయం సాధిస్తుందని వెల్లడించింది.
మహాకూటమికి 37 సీట్లు, బీజేపీకి 7 సీట్లు, ఎంఐఎంతో పాటు ఇతరులు 9 స్థానాల్లో గెలుస్తారని టైమ్స్ నౌప్రకటించింది.
న్యూస్-18 సర్వే కూడా టీఆర్ఎస్ పార్టీకే అధిక స్థానాలు వస్తాయని అంచనా వేసింది.
టీఆర్ఎస్ 50-65 సీట్లు, మహాకూటమి 38-52, బీజేపీ 4-7, ఇతరులు 8-14 స్థానాల్లో గెలుస్తాయని న్యూస్-18.
ఇండియా టుడే ఎగ్జిట్ పోల్స్: టీఆర్ఎస్ – 79 నుంచి 91, మహాకూటమి – 21 నుంచి 33, బీజేపీ – 1 నుంచి 3, ఇతరులు – 7.
రిపబ్లిక్ జన్కీ బాత్ సర్వే: టీఆర్ఎస్కు 52 నుంచి 65 స్థానాలు, ప్రజాకూటమికి 38 నుంచి 52 స్థానాలు, బీజేపీకి 4 నుంచి 7 స్థానాలు, ఇతరులకు 8 నుంచి 14 స్థానాలు వస్తాయని అంచనా.