టీడీపీ అధినేత చంద్రబాబు పై టీఆర్ఎస్ నాయకుడు కేటీఆర్ ఘాటైన వ్యాఖ్యలు చేసాడు.రాజకీయంగా చంద్రబాబు అంతుచూసేందుకు అవసరమయితే ఏపీలోనూ వేలుపెడతామని సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు తెలంగాణ రాజకీయాల్లో అనవసరంగా వేలుపెట్టారన్నారు.
చంద్రబాబు తన శక్తిని చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నారని, డబ్బులు, మీడియా రెండింటినీ అడ్డం పెట్టుకొని ఆయన రాజకీయం చేస్తున్నారని విమర్శించారు.నాలుగు బిల్డింగులు కట్టి చంద్రబాబే అంత ఫోజు కొడితే అసాధ్యమనుకున్న తెలంగాణను తెచ్చిన కేసీఆర్కు ఎంతుండాలని కేటీఆర్ ఎద్దేవా చేశారు.
‘నేనేం తప్పుచేశానని చంద్రబాబు అంటున్నారు.నువ్వు తప్పు చేయలేదా.? నువ్వు సుద్దపూసవా.? మీ పార్టీ ఎమ్మెల్యే కాదా 50 లక్షల బ్యాగ్ తో అడ్డంగా దొరికింది? మనవాళ్లు బ్రీఫ్ డ్ మీ అన్నది ఎవరు, తన వాయిస్ కాదని చంద్రబాబు ఎందుకు చెప్పలేకపోతున్నారని నిలదీశారు.‘ఎవరిని రాజకీయంగా దెబ్బతీసేందుకు సుహాసినికి టికెట్ ఇచ్చారో అందరికీ తెలుసన్నారు.నందమూరి కుటుంబానికి రాజకీయంగా భవిష్యత్తు లేకుండా చేసేందుకు కాదా.? నందమూరి కుటుంబం మీద అంత ప్రేమ ఉంటే తమ కొడుకును మంత్రిని చేసినట్లు ఆమెను కూడా చేయవచ్చు కదా? అని ప్రశ్నించారు.మాట్లాడితే 40 ఇయర్స్ ఇండస్ట్రీ అంటుంటారు.
సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడంలో చంద్రబాబుకు రికార్డు ఉంది ‘ అని కేటీఆర్ సంచలన వ్యాఖ్యలుచేశారు.