ఆ క్షేత్రాన్ని సందర్శించడం వల్ల చేసిన పాపాలన్నీ పోయి తప్పక మోక్షం లభిస్తుందని చెబుతారు.మరికొంత మంది ముసలివారు జీవిత చరమాంకంలో ఇక్కడే ఆశ్రయం పొందుతూ తమ ప్రాణాలను వదిలివేస్తుంటారు.
అదే హిమాలయ పర్వతాల్లో ఉన్న పశుపతినాథ దేవాలయం.ఇక్కడ పరమశివుడు పశుపతినాథ రూపంలో కొలువై ఉన్నాడు.
ఆ ఆలయ విశిష్టత ఏంటో మనం చూద్దాం
సాధారణంగా పుట్టుక మరణాలు ఎవరూ అంచనా వేయలేరు.అయితే ఈ పశుపతినాథ దేవాలయంలో ప్రధాన అర్చకులు భక్తుల మరణానికి సంబంధించిన రోజు, సమయాన్ని ఖచ్చితంగా తెలియజేస్తారు.
ఇక్కడి వాతావరణంలో మరణ దేవత ఉండటమే ఇందుకు కారణమని చెబుతారు.
పశుపతినాథ దేవాలయం బంగార శిఖరంతో అత్యంత అందంగా కనిపిస్తూ ఉంటుంది.ఈ దేవాలయం భగవతి నది తీరంలో, పశ్చిమ దిశలో ఉంది.ఈ దేవాలయానికి నాలుగు ప్రధాన ద్వారాలు ఉన్నాయి.
ఈ దేవాలయ ప్రధాన శిఖరాల పై బంగారు కళశాలను అమర్చారు.ఆ సూర్య కిరణాలు వీటి పై పడినప్పుడు ఇవి మెరిసిపోతు కనులకు విందును చేస్తాయి.
ఈ దేవాలయం గర్భగుడిలోకి మాత్రం కేవలం హిందువులకు మాత్రమే అనుమతి.మిగిలిన దేవాలయ ప్రాంగణం మొత్తం ఎవరైనా తిరుగవచ్చు.
LATEST NEWS - TELUGU