అందరిలా సినిమాలు చేస్తే నేను రవిబాబు ని ఎందుకు అవుతాను అంటూ… చిత్ర విచితైనా కథాంశాలతో అందరిని ఆకట్టుకునే … రవి బాబు ఈ సరి పంది పిల్ల ను పెట్టి సినిమా పూర్తి చేసాడు.ఈ సినిమాకి సురేష్ బాబు నిర్మాత.
ఇది ఓ పంది పిల్ల నేపథ్యంలో సాగే సరదా కథ.పందికి `బంటి` అనే పేరు పెట్టారు.ఈ బంటీకి రాజేంద్రప్రసాద్ గాత్రదానం చేశారు.బంటి మనసులో అనుకునే మాటలు.రాజేంద్రప్రసాద్ నోటి నుంచి వినిపిస్తాయన్నమాట.ఇదో త్రీడీ యానిమేషన్చిత్రం.
ఇండియాలోనే ఇప్పటి వరకూ ఇలాంటి ప్రయత్నం చేయలేదని చిత్రబృందం చెబుతోంది.చాలా ఏళ్ల నుంచీ ఈ సినిమా సెట్స్పైనే ఉండిపోయింది.సినిమా పూర్తయి కూడా చాలా రోజులైంది.మంచి రిలీజ్డేట్ కోసం ఇన్నాళ్లూ చిత్రబృందం ఎదురుచూసింది.ఇప్పుడు ఈసినిమాకి కొన్ని హంగులు అద్ది, కమర్షియల్ గానూ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్త పడుతున్నారు.
తాజా వార్తలు