అంతర్గత కుమ్ములాటలతో సీబీఐ పరువు బజారున పడేసిన సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ప్రధాని మోదీ తప్పించారు.రాత్రికి రాత్రే కొత్త డైరెక్టర్ను మోదీ ప్రభుత్వం నియమించింది.
కొత్త డైరెక్టర్ గా …మన్నెం నాగేశ్వరరావును నియమిస్తూ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది.నాగేశ్వరరావు తక్షణమే బాధ్యతలు చేపట్టనున్నారు.
1986 బ్యాచ్కు చెందిన నాగేశ్వరరావు.ఒడిశా కేడర్లో విధులు నిర్వర్తించారు.గతంలో ఒడిశా డీజీపీగా కూడా పనిచేశారు.విజయరామారావు తర్వాత తెలంగాణ అధికారికి సీబీఐ డైరెక్టర్ అవకాశం వచ్చింది.నాగేశ్వరరావు స్వస్థలం వరంగల్ జిల్లా మండపేట మండలం బోర్నర్సాపూర్.ఇప్పటివరకు ఈయన సీబీఐ లో జాయింట్ డైరెక్టర్ గా కొనసాగుతున్నారు.