తిత్లీ తుఫాను ఎఫెక్ట్ శ్రీకాకుళం జిల్లాపై ఎంతటి ప్రభావాన్ని చూపిందే ప్రత్యేకించి చెప్పనవసరం లేదు.ఆ దారుణమైన నష్టం నుంచీ కొల్కోవాలి అంటే చాలా సమయం పడుతుంది.
అసలే కష్టాలలో లోటు బడ్జెట్ లో ఉన్న ఏపీ రాష్ట్రానికి ఈ తుఫాను గట్టి దెబ్బే అని చెప్పాలి అయితే ఈ తుఫాను ఎఫెక్ట్ ఒక్క శ్రీకాకుళంకి మాత్రమే కాదు ప్రతిపక్ష పార్టీ వైసీపీకి కూడా భారీగా దేబ్బెసింది.జగన్ వేసిన చిన్న తప్పటడుగు వలన జనసేన కి ఉత్తరాంధ్రలో కోలుకోలేని దెబ్బ తగిలిందని అయితే ఈ తప్పు జగన్ చేసింది కాదని పార్టీలో ఉన్న సీనియర్స్ అందుకు కారణమని అంటున్నారు.
ఇంతకీ ఏమిటా తప్పు.ఏమి జరిగింది అనే వివరాలలోకి వెళ్తే.
తిత్లీ తుపానును ఎఫెక్ట్ పెద్దగా ఉండదని వైసీపీ నేతలు ఆ విషయాన్ని లైట్ తీసుకున్నారు అంతేకాదు జగన్ ని కూడా లైట్ తీసుకోమన్నారట.పాదయాత్ర మానుకుని మీరు అక్కడికి వచ్చేంతటి ఎఫెక్ట్ కాదులెండి అంటూ సర్ది చెప్పారట దాంతో జగన్ కూడా లైట్ తీసుకున్నాడు ఇప్పుడు అదే జగన్ కొంప ముంచింది.ఎప్పుడూ ఎవరి మాట వినని జగన్ ఈ సారి సీనియర్స్ మాటలకి అడ్డంగా తల ఊపడంతో బాబు కి అదే బ్రహ్మాస్త్రం గా పని చేస్తోంది.
పక్కనే ఉన్నా సరే కనీసం పలకరించడానికి రాలేదు అంటూ శ్రీకాకుళం జిల్లాలో వెళ్ళగానే ముఖ్యమంత్రి చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు చేస్తూ వచ్చారు.
ఇక్కడ జనం చచ్చిపోతూంటే పట్టించుకోని జగన్ రాజకీయాల్లో పనికిరాడని చంద్రబాబు హాటెస్ట్ కామెంట్స్ చేశారు.ఈ కామెంట్స్ తో జగన్ బాబు కి దిమ్మ తిరిగిపోయింది.జగన్ కి ఎక్కడ తగలాలో అక్కడే తగిలాయి.
కానీ అప్పటికే జగన్ రాలేదు పక్కనే ఉంటూ కనీసం పట్టించుకోలేదు అంటూ అక్కడి లోకల్ నేతలు, జనాలు చెవులు కొరుక్కోవడంతో బాబు గారు వేసిన ప్లాన్ సూపర్ సక్సెస్ అయ్యింది.ఆయనకు కోర్టులకు వెళ్ళడానికి సెలవు దొరుకుతుంది.వెళ్ళకపోతే జైల్లో వేస్తారంటూ బాబు పంచులు కూడా పేల్చారు.
జగన్ ముద్దులు పెడుతూ పాదయాత్రలో బుర్రలు నిమురుతూ నడవడం కాదు.నిజమైన ప్రేమ కలిగిన నేతవి అయ్యి ఉంటే తప్పకుండా తిత్లీ బాధితులను చూసేందుకు వచ్చే వాడివి అంటూ బాబు ఫైర్ అయ్యారు.
దాంతో పాదయాత్రలో వచ్చిన క్రెడిట్ అంతా తిత్లీ తుఫానులో కొట్టుకుపోయింది అంటున్నారు పరిశీలకులు.