తిత్లీ తుఫాన్ ప్రభావం తో ఏపీలోని శ్రీకాకుళం, ఒరిస్సా ప్రాంతాలు కోలుకోలేని దెబ్బతిన్నాయి.ప్రస్తుతానికి ఆ ప్రాంతాలకు సహాయ కార్యక్రమాలు అందుతున్నా…నష్టం మాత్రం తీర్చలేనంతగా ఉంది.
ప్రస్తుతం ఒడిశాలోని గజపతి జిల్లాలో చోటుచేసుకున్న ఓ సంఘటన అందరిని కలిచివేస్తోంది.ముకుంద్ దొర అనే వ్యక్తి తన ఏడేళ్ల కుమార్తె మృతదేహంతో 8 కిలీమీటర్లు నడచి వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.
లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని గ్రామంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.తిత్లీ తుఫాన్ సమయం నుంచి ముకుంద్ దొర కుమార్తె బబిత కనిపించకుండా పోయింది.తుఫాన్ సమయం వీచిన భీకర గాలులకు కొండచరియలు విరిగిపడడంతో బబిత మృతి చెందిందని నిన్న మొన్న అధికారులు ప్రకటించారు.ఈ విషయాన్ని కుటుంబసభ్యులకు చేరవేసిన అధికారులు.మృతదేహం ఎక్కడుందో చెప్పారు.
ప్రభుత్వ పరిహారం అందాలంటే పోస్టుమార్టం తప్పనిసరి అని.అందుకే మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావాల్సిందిగా సూచించారు.తుఫాన్ దాటికి సర్వస్వం కోల్పోయిన ముకుంద్.
వాహనం సమకూర్చుకోవడానికి డబ్బుల్లేక తన భుజాన కుమార్తె మృతదేహాన్ని ఓ సంచిలో మోసుకుని ఆస్పత్రికి బయలుదేరాడు.మీడియా ద్వారా సమాచారం అందుకున్న అధికారులు.
అప్పటికప్పుడు వాహనం సమకూర్చారు.
తాజా వార్తలు