రాజస్థాన్లోని శ్రీగంగానగర్ మా సొంత ఊరు.అక్కడే నేను పుట్టా.
చిన్నప్పటి నుంచి నన్ను పెంచడం, చదివించడం కోసం మా అమ్మ ఎంతగానో కష్టపడింది.ఆమె పడిన కష్టాన్ని మాటల్లో చెప్పలేను.
నేను ఐఐటీ చదివి గొప్ప ఉద్యోగంలో స్థిర పడాలనేది ఆమె కోరిక.అందులో భాగంగానే నేను కష్టపడి చదివా.
ఐఐటీ ఢిల్లీలో సీటు సంపాదించా.అయితే అనుకోకుండా అక్కడ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్లో నాకు 10కి కేవలం 4.7 ఎస్జీపీఏ మాత్రమే వచ్చింది.దీంతో నాకు E గ్రేడ్ ఇచ్చారు.
అలా E గ్రేడ్ వచ్చాక నన్ను డిసిప్లినరీ కమిటీ ముందు నిలబెట్టారు.వారు తరువాతి సెమిస్టర్లో నాకు 20 క్రెడిట్స్ టార్గెట్ పెట్టారు.అయితే అనుకోకుండా రెండో సెమిస్టర్లోనూ నాకు కేవలం 5.5 ఎస్జీపీఏ మాత్రమే వచ్చింది.మళ్లీ E గ్రేడ్ ఇచ్చారు.దీంతో నేను తీవ్రమైన డిప్రెషన్కు లోనయ్యా.మరో వైపు అప్పుడే మా అమ్మ ఆరోగ్యం బాగా క్షీణించింది.ఆమెను రక్షించుకోవాలని బాగా ప్రయత్నం చేశాం.
అయితే దురదృష్టవశాత్తూ అమ్మ నన్ను విడిచిపెట్టి కానరాని లోకానికి వెళ్లిపోయింది.దీంతో ఆ సంఘటన నన్న మరింత కుంగదీసింది.
తిరిగి కాలేజీకి వచ్చా.నాకు ఏం చేయాలో తోచలేదు.ఓ వైపు అమ్మ మరణం.మరో వైపు నాకు వస్తున్న E గ్రేడ్లు.
చూసి ఏం చేయాలో అర్థం కాలేదు.అయితే అమ్మ నన్ను కోరిన కోరిక ఒక్కటే.
చదువుల్లో బాగా రాణించి ఉన్నత స్థానంలో ఉద్యోగం చేయాలని.అదే నా మనస్సులోకి వచ్చింది.
ఇక ఆగలేదు.వెంటనే నా పని ప్రారంభించా.
చాలా సీరియస్గా చదువులపై దృష్టి సారించా.దీంతో ప్రతి సెమిస్టర్ లోనూ నాకు 9.8 ఎస్జీపీఏ వచ్చింది.ఓవరాల్గా 7.1 జీపీఏ సాధించి మంచి పొజిషన్లో బీటెక్ పాసయ్యా.ఇప్పుడు అమెరికాలో జాబ్ చేస్తున్నా.
ఉన్నత స్థానంలో ఉన్నా.ఇదే కదా అమ్మ కోరుకుంది.
ఆమె అనుకుంది నెరవేర్చినందుకు నాకు ఎంతో సంతోషంగా ఉంది.అమ్మ మా మధ్య లేకపోయినా నాతో ఎప్పుడూ అమ్మ నా వెన్నంటి ఉంటుందని నమ్ముతున్నా.!” — అనుపమ్ పన్వార్ అనే వ్యక్తికి సంబంధించిన యదార్థ గాథే ఇది.రియల్ స్టోరీ.!
.