నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేటలో కాంగ్రెస్ ప్రచార సభలో అపశ్రుతి చోటుచేసుకుంది.కాంగ్రెస్ ప్రచార సభలో ఏర్పాటు చేసిన వేదిక ఒక్కసారిగా కూలిపోయింది.
స్టేజీపై నాయకులంతా కూర్చొని ఉండగా ఆ పార్టీ స్టార్ క్యాంపెయినర్ విజయశాంతి నిలబడి పార్టీ కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు.అదే సమయంలో సభా వేదిక ఒక్కసారిగా కూలింది.
ఈ ఘటనలో విజయశాంతి వేదికపై నుంచి కింద పడ్డారు.ఘటన జరిగిన సమయంలో వేదికపై విజయశాంతి, భట్టివిక్రమార్క, నంది ఎల్లయ్య, పలువురు నాయకులు ఉన్నారు.
అదృష్టవశాత్తూ ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు.
.
తాజా వార్తలు