మొహమాటానికి పోతే మొదటికే మోసం వస్తుందన్న సంగతి చాలా లేటుగా గుర్తించాడు వైఎస్సార్ కాంగ్రెస్ అధినేత జగన్.అందుకే ఎవరు ఏమనుకున్నా .
ఎన్ని విమర్శలు వస్తున్నా ఏ మాత్రం లెక్కజేయకుండా సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నాడు.ఈ మధ్య జగన్ ఇస్తున్న షాక్ లు ఆయనకు అత్యంత సన్నిహితంగా మెలుగుతున్నవారికే తగులుతున్నాయి.
దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నా జగన్ ఏ మాత్రం లెక్కజేయడంలేదు.ఎందుకంటే.జగన్ కి కావల్సింది ఎన్నికల్లో పార్టీ విజయం.అనవసర మొహమాటాలకు పోకుండా ముందుజాగ్రత్తలు తీసుకునే పనిలో ఇప్పుడు బిజీ అయిపోయాడు.
గత ఎన్నికల సమయంలో సీట్ల ఎంపిక విషయంలో పూర్తిగా తన సొంత మనుషులు, తనను నమ్ముకుని ఉన్నవాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చాడు జగన్.అయితే జగన్ సొంత బంధువు బాలినేని శ్రీనివాసరెడ్డిలాంటివాళ్ళతో సహా చాలా మంది ఎన్నికల సమయంలో కష్టపడలేదు.జేసీ దివాకరరెడ్డి సోదరులు లాంటి బలమైన నేతలు వైకాపాలోనికి వస్తానంటే వాళ్ళను కాదని మరీ తనను నమ్ముకున్నవాళ్ళకు సీట్లు కేటాయిస్తే ఆయా నాయకులందరూ కూడా పూర్తిగా భారం అంతా జగన్పైన వేసి గెలుపు గ్యారెంటీ అని నిర్లక్ష్యంగా ఉండడం మొత్తం పార్టీ విజయావకాశాలనే దెబ్బతీసింది.ఇప్పుడు కూడా అదే పరిస్థితి తెలత్తేలా కనిపిస్తుండడంతో జగన్ అలెర్ట్ అయ్యాడు.
తనకు సన్నిహితులు అయిన వాళ్ళకంటే ప్రజల్లో మంచి పేరు ఉన్నవాళ్ళు, నాలుగేళ్ళుగా పార్టీ కోసం కష్టపడిన నేతలకు…తనలాగే ఎక్కువ కాలం ప్రజల మధ్య ఉన్న నేతలకు సీట్ల ఎంపికలో ప్రాధాన్యం ఇస్తున్నాడు.జగన్లో వచ్చిన ఈ మార్పు వైకాపా సీనియర్ నేతల్లో ఆందోళన పెంచుతున్నప్పటికీ యువ నాయకులు, ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం అహర్నిశలూ కష్టపడుతున్న నాయకులకు మాత్రం సంతోషం కలిగిస్తోంది.జగన్ తీసుకున్న ఈ స్టెప్ ప్రస్తుతం విమర్శలకు గురవుతున్నా … పార్టీకి ఇది కలిసొచ్చే అంశంగానే కనిపిస్తోంది.