చేతులకు 12 వేళ్లు, కాళ్లకు 12 వేళ్లతో జన్మించడం ఆ బాలుడి పాలిట శాపంగా మారింది.మూఢనమ్మకాల పేరుతో బంధువులే ఓ బాలుడిని బలి ఇచ్చేందుకు ప్రయత్నిస్తుండటం ఉత్తరప్రదేశ్లోని బారాబంకి జిల్లాలో కలకలం రేపింది.
లోపంతో పుట్టిన బాలుడిని బలి ఇస్తే సంపద కలిసి వస్తుందని ఓ తాంత్రికుడు అతని బంధువులకు తెలిపాడు.దీంతో వారు ఆ బాలుడిని చంపాలని ప్రయత్నించారు.
ఈ విషయం తెలుసుకున్న ఆ బాలుడి తల్లితండ్రులు కొడుకును కాపాడుకోవడానికి కంటిమీద కునుకు లేకుండా కాపలా కాస్తున్నారు.కనీసం ఆ బాలుడిని బడికి కూడా పంపడంలేదు.
పోలీసులను కూడా ఆశ్రయించారు.
దీనిపై బారాబంకి పోలీసు అధికారి ఉమాశంకర్ సింగ్ స్పందిస్తూ.ఆ బాలుడు చదుకోవడానికి పోలీసులు సహాయం చేస్తారని చెప్పారు.ఆ బాలుడి ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా తను ఇక్కడ బాధ్యతలు నిర్వహించినంత కాలం బాలుడి చదువుకయ్యే ఖర్చులు భరిస్తానని వెల్లడించారు.
అంతేకాదు బాలుడిని చంపాలి అనుకున్న వారిపై విచారణ మొదలుపెడతాం అన్నారు.