లోక్సభ మాజీ స్పీకర్ సోమ్నాథ్ చటర్జీ(89) మృతితో అయన సన్నిహితులు, అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.సోమవారం ఉదయం తుదిశ్వాస విడిచిన ఈ కమ్యూనిస్టు యోధుడు, భారత లోక్సభ మాజీ స్పీకర్.
మృతదేహానికి అంత్యక్రియలను నిర్వహించడం లేదు.ఈ మేరకు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఒక ప్రకటన చేశారు.
సోమ్నాథ్ చటర్జీ మృతదేహాన్ని కోల్కతాలోని ఎస్ఎస్కేఎమ్ మెడికల్ కాలేజీకి ఇవ్వబోతున్నట్టుగా మమత ప్రకటించారు.తన మరణాంతరం భౌతికకాయాన్ని పరిశోధనలకు ఉపయోగపడేవిధంగా ఏదైనా మెడికల్ కాలేజీకి విరాళంగా ఇవ్వాలని 2002లోనే ఆయన కోరారు.
దీంతో ఆయన కోరుకున్న విధంగా పార్థీవదేహాన్ని స్థానిక ఎస్ఎస్కేఎమ్ హాస్పిటల్కు తరలించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది.
మెడికల్ కాలేజీకి తరలించే ముందు లీగల్ లాయర్ అయిన ఈ కమ్యూనిస్టు నేతకు కోల్కతా హైకోర్టుతో ఎంతో అనుబంధం ఉంది.దీంతో అయన పార్థీవదేహాన్ని గౌరవార్థం హైకోర్టుకు తరలిస్తారు.అక్కడి నుంచి కోల్కతా అసెంబ్లీలో కాసేపు ఉంచి.
నివాళి ఘటించిన అనంతరం మృతదేహాన్ని మెడికల్ కాలేజీకి అప్పగించనున్నట్టుగా పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ప్రకటించింది.ఇప్పటికే పలువురు రాజకీయ నాయకులు, ప్రముఖులు సోమ్నాథ్ చటర్జీ మృతి పట్ల సంతాపం ప్రకటించారు.