సైరా నరసింహారెడ్డి చిత్రాన్ని స్వాతంత్య్ర సమరయోధుడు, బ్రిటీష్ వారిపై పలు సార్లు యుద్దం చేసిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత చరిత్రతో తెరకెక్కిస్తున్నారు.సురేందర్ రెడ్డి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని దాదాపు 150 కోట్ల బడ్జెట్తో రామ్ చరణ్ నిర్మిస్తున్న విషయం తెల్సిందే.
ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ కార్యక్రమాల మొదలుకు సంవత్సరం పట్టింది.ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను పరుచూరి బ్రదర్స్ చాలా ఏళ్ల క్రితమే రెడీ చేసుకున్నారు.
ఇప్పుడు ఆ సినిమా తెరకెక్కుతుంది.ఉయ్యాలవాడ ఫ్యామిలీ ఇప్పుడు మెగా ఫ్యామిలీపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమ వంశ పెద్ద గురించి సినిమా తీస్తుంటే చాలా సంతోషంగా ఉందని, అది చిరంజీవి గారు మా సినిమాను తీస్తున్నందుకు సంతోషంగా ఉంది అంటూనే తమ అనుమతి తీసుకోలేదు అంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.తాజాగా ఏబీఎన్ న్యూస్ ఛానెల్లో ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులు చర్చకు వచ్చారు.ఉయ్యాలవాడ ఫ్యామిలీలో చాలా మంది కూడా బీదరికంలో ఉన్నారు.మద్యతరగతి దిగువన ఉన్న వారు కూడా ఉన్నారు.దాంతో వారికి ఆర్థిక సాయం చేస్తే బాగుంటుందని కొందరు మెగా ఫ్యామిలీకి సూచించారు.
ఉయ్యాలవాడ సినిమాను చేస్తున్నందుకు వారిని ఆర్థికంగా రామ్ చరణ్ ఆదుకుంటాను అంటూ హామీ ఇచ్చాడు.కాని ఇప్పుడు ఆ హామీని చరణ్ మర్చి పోయాడేమో.అందుకే ఉయ్యావాడ ఫ్యామిలీ సభ్యులు తమ ఆగ్రహంను మీడియా ద్వారా వ్యక్తం చేసేందుకు ముందుకు వచ్చారు.
భారీ ఎత్తున సినిమాను తెరకెక్కిస్తున్న చిత్ర యూనిట్ సభ్యులకు ఇలా జరగడం అనేది పెద్ద తలనొప్పిగా మారింది.ఇటీవలే సెట్ను ప్రభుత్వ అధికారులు కూల్చివేయడంతో త పట్టుకున్న చిత్ర యూనిట్ ఇప్పుడు ఉయ్యాలవాడ ఫ్యామిలీతో విభేదాల కారణంగా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు.
సినిమా టైటిల్లో ఉయ్యాలవాడ ఉండాలని కూడా ఫ్యామిలీ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.అయితే ఉయ్యాలవాడ కుటుంబ సభ్యులతో సంబంధం లేకుండా సైరాను పూర్తి చేయాలని మెగా ప్రయత్నాలు.
చివరకు ఈ విషయం చిత్రంపై ప్రభావం చూపించే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.