అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ హీరోయిన్గా తెరకెక్కిన ‘ధడక్’ చిత్రం ఇటీవలే హిందీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే.భారీ అంచనాల నడుమ రూపొందిన ‘ధడక్’ చిత్రం అంచనాలను అందుకుంది.
కేవలం మొదటి వారాంతంలోనే ఈ చిత్రం 20 కోట్ల వసూళ్లను సాధించినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.భారీ స్థాయిలో క్రేజ్ను దక్కించుకున్న జాన్వీ కపూర్కు వరుసగా ఆఫర్లు వెళ్లువెత్తుతున్నాయి.
చనిపోయిన శ్రీదేవికి జాన్వీ కపూర్ ఒక బహుమానం అంటూ ఆమె అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తెలుగులో శ్రీదేవి ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
టాలీవుడ్పై చెరగని ముద్ర వేసిన శ్రీదేవి వారసురాలిని కూడా ఇండస్ట్రీకి తీసుకు రావాలని కొందరు ప్రయత్నాలు చేస్తున్నారు.‘ధడక్’ చిత్రం తర్వాత జాన్వీ రెండవ సినిమాను హిందీలో చేయాలని భావిస్తుంది.
అయితే దిల్రాజు మరియు రాజమౌళిలు జాన్వీ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడు.జాన్వీ రెండవ సినిమాను తెలుగులో చేయించాలనే పట్టుదలతో వీరిద్దరు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ముఖ్యంగా దిల్రాజు తన సినిమాలో జాన్వీని నటింపజేసేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నాడు.
త్వరలోనే ఒక యువ స్టార్ హీరోతో దిల్రాజు చిత్రం నిర్మించబోతున్నాడు.ఆ చిత్రంలో హీరోయిన్గా జాన్వీ కపూర్ అయితే చాలా బాగుంటుందనే అభిప్రాయంతో దిల్రాజు ఆమెను సంప్రదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు.ఇప్పటికే హిందీలో తనకున్న పరిచయాల ద్వారా విషయాన్ని జాన్వీ తండ్రి బోణీ కపూర్ వద్దకు తీసుకు వెళ్లాడు.
ఇక టాలీవుడ్ జక్కన్న రాజమౌళి కూడా శ్రీదేవి కూతురును తన మల్టీస్టారర్ చిత్రంలో ఒక హీరోయిన్గా ఎంపిక చేయాలని భావిస్తున్నాడు.
గతంలో బాహుబలి చిత్రంలో శ్రీదేవితో పని చేయాలని రాజమౌళి కోరుకున్నాడు.
కాని షాకింగ్గా శ్రీదేవి ఆ సమయంలో నో చెప్పింది.ఇప్పుడు జాన్వీని తన మల్టీస్టారర్ మూవీలో చూపించాలని తాపత్రయ పడుతున్నాడు.
అయితే తెలుగులో ఇప్పుడే నటించే ఆలోచన లేదని జాన్వీ కపూర్ అంటున్నట్లుగా తెలుస్తోంది.మొదట హిందీలో వరుసగా చిత్రాలు చేసి, ఆ తర్వాత సౌత్ చిత్రాలపై దృష్టి పెట్టనుందట.
తన తల్లి సౌత్ నుండి బాలీవుడ్కు వెళ్లింది కనుక తప్పకుండా సౌత్లో నటిస్తాను అంటూ ఈమద్య ఈమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.జాన్వీ మొదటి సౌత్ మూవీ ఎప్పుడెప్పుడు ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.