తెలుగు బిగ్బాస్ సీజన్ 2 మెల్ల మెల్లగా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతూ వచ్చింది.మొదటి రెండు వారాలతో పోల్చితే ప్రస్తుతం షో ఆసక్తికరంగా సాగుతుంది.
గొడవలు, ప్రేమలు, కోపాలు ఇలా అన్ని విధాలుగా బిగ్బాస్లో ఎంటర్టైన్మెంట్ దక్కుతున్న నేపథ్యంలో ప్రేక్షకులు టీవీలకు అతుక్కు పోతున్నారు.తాజాగా బిగ్బాస్ నుండి తేజస్వి ఎలిమినేట్ అయిన విషయం తెల్సిందే.
తేజస్వి ఎలిమినేట్ అవ్వడం అందరికి షాక్ ఇచ్చింది.అసు ఈ పరిణామాన్ని ప్రేక్షకులు ఎంత మాత్రం ఊహించలేదు.
ఇక బిగ్బాస్ నుండి ప్రేక్షకులు బయటకు పంపిన వారిలోంచి ఒకరిని మళ్లీ లోనికి పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి.
ఇప్పటికే ఎలిమినేట్ అయిన వారిలో ఒకరిని ప్రేక్షకుల ఓటింగ్ ద్వారా లోనికి పంపించే వెసులుబాటు కల్పిస్తున్నారు.
ఇక ఈ వారం చేరికలో తప్ప తొలగింపులు లేవు.ఎలిమినేషన్ నామినేషన్స్ తాజా ఎపిసోడ్లో జరిగాయి.కాని ఎలిమినేషన్ అంటూ ఇంటి సభ్యులు టెన్షన్ పడటమే తప్ప, ఈ వారం నామినేషన్స్లో ఉన్న ఏ ఒక్కరు కూడా ఎలిమినేషన్ కాబోవడం లేదు.ఎలిమినేషన్కు సంబంధించిన ఓటింగ్ పెట్టడం లేదు అంటూ నిర్వాహకులు ప్రకటించారు.
ఎలిమినేషన్లో మాత్రం కౌషల్, గణేష్, బాబు గోగినేని, అమిత్, దీప్తి సునయనలు ఉన్నట్లుగా బిగ్బాస్ ప్రకటించాడు.
ఎలిమినేషన్స్లో ఉన్న వీరు వారం అంతా కూడా టెన్షన్ పడుతూనే ఉంటారు.కాని వారాంతంలో మాత్రం వీరిలోంచి ఏ ఒక్కరు కూడా బయటకు వెళ్లి పోరు.ఇక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా పూజా రామచంద్రన్ను బిగ్బాస్ నిర్వాహకులు ఇంట్లోకి పంపించారు.
బిగ్బాస్లో ఇప్పటికే వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా నందిని రాయ్ వెళ్లింది.ఇప్పుడు పూజా రామచంద్రన్ ఎంట్రీ ఇచ్చింది.ఈమె తెలుగులో పలు చిత్రాల్లో నటించింది.తమిళనాట ఈమెకు మంచి గుర్తింపు ఉంది.
ఈమె ఎంట్రీతో బిగ్బాస్కు మసాలా యాడ్ అవ్వడం ఖాయం అని ప్రేక్షకులు భావిస్తున్నారు.
మొత్తానికి వచ్చే వారాంతంలో ఏం జరుగబోతుందా అని ప్రేక్షకులు అంతా కూడా ఇప్పుడే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఎలిమినేట్ అయిన ఆరుగురిలో ఎవరు రీ ఎంట్రీ ఇస్తారు, అలాగే ఎలిమినేషన్ నామినేషన్స్లో ఉన్న ఇంటి సభ్యుల పరిస్థితి ఏంటీ అనే విషయాలు ఆసక్తికరంగా ఉన్నారు.మొత్తానికి ఈ వారం అంతా కూడా బిగ్బాస్ చాలా థ్రిల్లింగ్గా జరిగే అవకాశం ఉందని అనిపిస్తుంది.