బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్ ప్రేమలో పడిందా.ఏమో పడిందేమో అంటున్నారు క్రీడాభిమానులు.
ఇంతకీ సైనా మనసు దోచిన ఆ కుర్రాడు ఎవరూ.గెస్ చేయండి.
క్లూ ఇవ్వమంటారా.ఒక డాక్టర్ మరో డాక్టర్ ని,యాక్టర్ యాక్ట్రెస్ ని ప్రేమించినప్పుడు బ్యాడ్మింటన్ స్టార్ మరెవరి ప్రేమలో పడుతుంది మరో బ్యాడ్మింటన్ తో … ఆ బ్యాడ్మింటన్ మరెవరో కాదు పారపల్లి కశ్యప్.
ఈ ఊహాగానాలంతటికి కారణం కూడా తనే.తను తన ట్విట్టర్లో పెట్టిన ఒక ఫోటోనే ఇప్పుడు వారిద్దరి మధ్య ఏదో జరుగుతుంది అని అందరూ మాట్లాడుకోవడానికి కారణం అయింది.
బ్యాడ్మింటన్ జంట ప్రేమలో పడింది.ఈ వార్త ఇప్పుడు హైదరాబాద్ స్పోర్ట్ న్యూస్లో వైరల్ అవుతోంది.
బ్యాడ్మింటన్ మాజీ వరల్డ్ నెంబర్ వన్ సైనా నెహ్వాల్తో మరో బ్యాడ్మింటన్ స్టార్ పారుపల్లి కాశ్యప్ ప్రేమలో పడినట్లు వార్తలు గుప్పుమన్నాయి.ఇటీవలే కామన్వెల్త్గేమ్స్లో పతకాలతో అదరగొట్టిన ఈ స్టార్లు.
ఈ మధ్య హైదరాబాద్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు.అప్పుడు వీరిద్దరూ దిగిన ఫొటో కాశ్యప్ తన సోషల్ మీడియా అకౌంట్లలో పోస్టు చేశాడు.
దీంతో ఈ ఫొటో చూసిన జనాలు… వీరిద్దరి మధ్య కొత్త ఆట మొదలైందంటూ కామెంట్లు చేయడం మొదలెట్టారు.
ఫొటో చూస్తే ఎవరికైనా అలాగే అనిపిస్తుంది వారిద్దరూ క్లోజ్ గా ఉండడం.
అక్కడ అంతమంది అబ్బాయిల మధ్య నిల్చున్న సైనా కశ్యప్ ని మాత్రమే క్లోజ్ గా నిల్చోవడం నెటిజన్ల ఊహలకి కారణం.దాంతో మీ మధ్య ఏదో ఉందంటూ పోస్టులు పెట్టారు.
ఈ కామెంట్లు చూసిన కాశ్యప్ మాత్రం తమ మధ్య ఏమీ లేదని… కేవలం తాము క్లోజ్ ఫ్రెండ్స్ మాత్రమేనని చెబుతున్నాడు.అంతకుమించి తమ మధ్య ఏమిలేదని వివరణ ఇచ్చాడు.
అయితే క్రీడాభిమానులు మాత్రం వీరి మధ్య ప్రేమ చిగురించిందని…అది త్వరలోనే బయటపడే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు.నిప్పులేనిదే పొగ రాదు.