ఏదైనా కొట్టేయాలంటే ప్లాన్ చేసి పని పూర్తి చేసే దాకా విపరీతమైన టెన్షన్.ఎక్కడ దొరికిపోతామేమోనని భయం.
వెళ్లిన చోట ఏదైనా విలువైన వస్తువులు దొరికితే బావుండనే ఆశ.ఇలా చాలా విషయాల్లో టెన్షన్ పడి అటెన్షన్ పాడవకుండా గుట్టు చప్పుడు లేకుండా పని పూర్తి చేసేవారు.ఇప్పుడు దొంగలు ట్రెండ్ మార్చారు.ఢిల్లీలో ఓ దొంగ వేసిన చిందులు చూస్తే మీరు ఆశ్చర్యపోవాల్సిందే.దుకాణాన్ని దొంగలిద్దామని వచ్చిన ఓ దొంగ… దొంగతనానికి ముందు ఇక తమ పని నెరవేరబోతుందనుకుంటూ.సంబురంలో మునిగి తేలిపోయాడు.
తన పార్టనర్తో కలిసి డ్యాన్స్లతో అదరగొట్టాడు.దుకాణం షట్టర్ తాళం బద్దలు కొట్టడానికి ముందు ఈ దొంగ ఎంత సంతోషంగా ఉన్నాడో, ఈ వీడియోను చూస్తేనే అర్థమవుతుంది.ఈ ప్రాంతమంతా నిఘాలో ఉందని గుర్తించిన అనంతరమే సీసీటీవీ యజమానిని టీజ్ చేసేందుకు ఆ దొంగ అలా చేశాడని తెలిసింది.ఇరవై రెండు సెకన్ల పాటు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఢిల్లీలోని ఓ గుర్తు తెలియని ప్రాంతంలో ఈ దొంగతనం జరిగింది.ఈ ఘటన జరిగిన రోజు రాత్రి దాదాపు ఐదుగురు దొంగలు 4 దుకాణాల్లో దొంగతనం చేసి లక్షల రూపాయలు, వస్తువులు కొట్టేసినట్లు పోలీసులు చెప్తున్నారు.ఈ దొంగతనంపై కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దొంగల కోసం గాలిస్తున్నారు.