మనకు చేసిన దోషాలు తొలగించుకోవడానికి వినాయకుణ్ణి పూజించటం మంచిదని చాలా మంది చెబుతుంటారు.అవును.
అది నిజమే.మనం చేసిన దోషాలు మన దగ్గరికి రాకుండా, మనం వాటిని తొలగించుకోవాలంటే వినాయకుని పూజ చేయాల్సిందే.
ఇప్పుడు .గణపతిని ఏ రూపంలో ఉన్నప్పుడు ఏ పూజారాధన చేస్తే ఏ దోషం పోతుంది, మనకు కలిగే ఫలితాలు ఏమిటో చూద్దాం.
* సూర్యదోష నివారణకు ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించాలి * చంద్ర దోష నివారణకు వెండి లేక పాలరాయితో చేసిన వినాయకుడిని పూజించాలి * కుజదోష నివారణకు రాగితో చేసిన వినాయకుడిని పూజిస్తే ఫలితం ఉంటుంది * బుధ దోష నివారణకు మరకత గణపతిని అర్చించాలి * గురు దోష నివారణకు పసుపు, చందనం లేక బంగారంతో చేసిన గణపతిని కొలవాలి * శుక్ర దోష నివారణకు స్ఫటిక గణపతికి ఆరాధన చేయాలి * శని దోష నివారణకు నల్లరాయిపై చెక్కిన గణపతిని పూజించాలి * రాహు గ్రహ దోషానికి మట్టితో చేసిన గణపతిని పుజిస్తే ఫలితం ఉంటుంది * కేతు గ్రహ దోష నివారణకు తెల్ల జిల్లేడుతో చేసిన గణపతిని పూజించాలి * ఎర్రచందనంతో చేసిన గణపతిని పూజించడం వల్ల అనారోగ్య సమస్యలు ఉండవు * పగడపు గణపతిని పూజించడం వల్ల అప్పుల బాధలు తొలగిపోతాయి * పాలరాయితో చేసిన గణపతిని పూజిస్తే మానసిక ప్రశాంతత కలుగుతుంది * మనకు ఎదురవుతున్న సమస్యలు తొలగిపోవాలంటే శ్వేతార్క గణపతిని పూజించాలి * స్ఫటిక గణపతిని పూజిస్తే సుఖశాంతులను ప్రసాదిస్తాడు.