డబ్బులు, బ్యాక్ గ్రౌండ్ ఉంటే ఏ పని అయినా సాధ్యపడుతుంది.బెల్లంకొండ సాయిశ్రీనివాస్ నే తీసుకోండి.
తొలి సినిమా “అల్లుడు శీను” నష్టాలు తీసుకొచ్చిన ఫర్వాలేదు అంటూ వివి వినాయక్, సమంతలను ఒప్పించి, తమన్నాతో ఐటమ్ సాంగ్ చేయించి మరి 30 కోట్ల దాకా ఖర్చుపెట్టారు.ఇప్పుడు “జై జానకి నాయక” సినిమాకి బోయపాటి దర్శకుడు, రకుల్ ప్రీత్ హీరోయిన్.
ఎలా ఉన్నాయో చూడండి కాంబినేషన్స్.అగ్రహీరో కొడుకులని తీసేస్తే, ఎవరికి ఇలాంటి క్రేజి కాంబినేషన్స్ ఇంత త్వరగా కుదిరాయి?
బోయపాటి సినిమా తరువాత డిక్టేటర్ తీసిన శ్రీవాస్ తో బెల్లంకొండ వారసుడి సినిమా ఉండొచ్చు.ఈ సినిమాకి పట్టుబట్టి మరి పూజ హెగ్డేని హీరోయిన్ గా తీసుకుంటున్నారు.చూడండి, ఈసారి కూడా క్రేజి హీరోయినే.డీజే తరువాత ఎలాగో ఈ అమ్మడి రేంజ్ లో మార్పు వస్తుంది.ఇక మహేష్ బాబు – వంశీ పైడిపల్లి సినిమాలో పూజనే హీరోయిన్ గా అనుకుంటున్నారట.
అది కూడా కన్ఫర్మ్ అయితే ఈ సినిమాకి అదో ప్లస్సు.ఇవన్ని దృష్టిలో పెట్టుకోనే పూజని సెలెక్ట్ చేసుకున్నారు.
ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ్ ఈ ప్రాజెక్టుని నో చెప్పకుండా, చెప్పలేకుండా, తను ఊహించలేని మొత్తాన్ని రెమ్యునరేషన్ గా ఇవ్వబోతున్నారు.ఒక లైలా కోసం, ముకుందా లాంటి సినిమాలకు 30-40 లక్షలు తీసుకున్న పూజ, డీజే – దువ్వాడ జగన్నాథంకి 60-70 లక్షలు తీసుకుంది.ఇప్పుడు బెల్లంకొండ వారు తన ప్రస్తుత రెమ్యునరేషన్ కి ఏకంగా మరో కోటి యాడ్ చేసి ఏకంగా 1.60 కోట్లు ఇస్తున్నారట.ఇది నార్మల్ గా తమన్నా, కాజల్ ఛార్జీ చేదే ఎమౌంటు.