కట్పప్ప బాహుబలిని ఎందుకు చంపాడు? బాహుబలి నే కట్టప్ప కో క్యూ మారా? వై కట్టప్ప కిల్డ్ బాహుబలి? భాషలతో సంబంధం లేకుండా యావత్ భారత దేశాన్ని వేధిస్తున్న ప్రశ్న ఇది.దాదాపుగా రెండేళ్ళు ఈ ప్రశ్నకి సమాధానం కోసం వేచి చూసారు.
ఇంకొక్క రోజు ఆగితే చాలు, కేవలం ఒక్కరోజులో బాహుబలిని కట్టప్ప ఎందుకు చంపాడో, శివగామి చేసిన పాపం ఏమిటో, భల్లాలదేవుడికి – దేవసేనకి మధ్య ఏం జరిగింది .అన్నీ తెలిసిపోతాయి.ఇక జనాలు పెద్దగా పట్టించుకోని మరో పెద్ద విషయం ఏమిటంటే, అసలు బాహుబలిని రాజు గద్దె నుంచి కిందికి ఎందుకు దించారు ?
ఒక్కసారి రెండున్నర ఏళ్ళు వెనక్కి వెళ్ళండి.రానా పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన ఓ వీడియోని గుర్తుతెచ్చుకోండి.
అందులో భల్లాలదేవుడు రాజుగా కనిపిస్తాడు.బాహుబలిని తొలగించి భల్లాలదేవుడిని రాజుగా చేస్తారని అక్కడే చెప్పేసారు.
అలా కాకుండా బాహుబలిని అసలు రాజుగా నియమించలేదు, శివగామి ప్రకటించినా, బాహుబలి రాజుగా చేసేటప్పుడు బిజ్జలదేవుడు అడ్డుకున్నాడని అనుకోవడానికి వీలు లేదు.ఎందుకంటే మాహిశ్మతి రాజుగా అమరేంద్ర బాహుబలి ప్రమాణస్వీకారం చేసాడు.
ఈ విషయాన్ని పార్ట్ 2 ట్రైలర్ లో చూపించారు కూడా.
బాహుబలి 2 ఫస్టాఫ్ లోనే బాహుబలి రాజుగా మారతాడు.
కాని ఇంటర్వల్ సమయానికి కథ అడ్డం తిరుగుతుంది.భల్లాలదేవుడికి రాజుగా పట్టాభిషేకం జరిగింది.
బాహుబలి సైన్యధ్యాక్షుడిగా తమ రాజుకి గౌరవాన్ని ఇస్తున్నాడు.భల్లాలదేవుడు గర్వంగా సింహాసనం వైపు కదులుతున్నాడు.
ఇక్కడే బాహుబలి ఇంటర్వల్ అని ఫిలింనగర్ లో టాక్.మరి నిజమో కాదో, ఒక్కరోజు ఆగితే తెలిసిపోతుంది.