ఏపీ చంద్రబాబు రష్యా పర్యటన లో ఉన్న సంగతి తెలిసిందే అయితే ఆయన ప్రోటోకాల్ ని పక్కన పెట్టేసిన విధానం ఏకంగా నరేంద్ర మోడీ కి కోపం తెప్పించింది అంటున్నారు.రష్యా ప్రధాన మంత్రి ని చంద్రబాబు అమరావతి ని సందర్సించాలి అని కోరారు దాని మీద కేంద్రం చాలా సీరియస్ గా ఉందంటున్నారు.
రష్యాలో జరిగిన ఇన్నోఫ్రామ్ సదస్సులో భారత్ భాగస్వామ్య దేశంగా ఉండటం.తాజాగా జరిగిన సదస్సుకు కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తున్నారు.
అయితే.రష్యా ప్రధానిని అమరావతికి ఆహ్వానించిన విషయంలో చంద్రబాబు తన పరిధి దాటినట్లుగా చెబుతున్నారు.రష్యా ప్రధానిని ఏపీకి ఆహ్వానించటం సరికాదని.గతంలో జపాన్ ప్రధాని విషయంలోనూ ఇదే తీరులో వ్యవహరించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.జపాన్ ప్రధాని ని తిరుమల ఆశీస్సుల కోసం రమ్మని కోరాడు చంద్రబాబు, ఏకంగా అమరావతి శంకుస్థాపన కి రామన్నారు అప్పుడే చంద్రబాబు కి మోడీ నుంచి ఇలాంటివి చెయ్యద్దు అని వార్నింగ్ ఒచ్చినా మళ్ళీ బాబు ఇలా చెయ్యడం తో ఇబ్బంది కరంగా ఉన్నారు మోడీ.దేశ ప్రధానిని పిలవాలి అంటే ప్రోటోకాల్ తప్పనిసరిగా పాటించాలి.