సీతమ్మ వాకిట్లో సిరిమల్లే చెట్టు చిత్రంతో ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించింది తేజస్వి మడివాడ.హీరోయిన్ గా చేసిన ప్రయత్నాలు ఫలించకపోయినా, క్యారక్టర్ ఆర్టిస్టుగానైతే తేజస్వికి అవకాశాలు బాగానే వస్తున్నాయి.
ఇక ఈ మధ్య విడుదలైన “రోజులు మారాయి” చిత్రంలో నెగెటివ్ పాత్ర పోషించింది తేజస్వి.సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకున్నా, తేజస్వీ నటన ఫర్వాలేదు అని ఆడియెన్స్ తీర్పునిచ్చారు.
ఇక ఈ సినిమా ప్రమోషన్స్ విషయంలో తేజస్వీకి, యూనిట్ సభ్యులకి బయటకి పూర్తిగా తెలియని గొడవేదో జరిగింది.తేజస్వీ చిత్ర షూటింగ్ సమయంలో, ఇప్పుడు ప్రమోషన్స్ లో మారుతి అండ్ టీమ్ కి చుక్కలు చూపించినట్టుంది.
దాంతో ” షూటింగ్ నుంచి ప్రమోషన్స్ దాకా మీరిచ్చిన సపోర్టుకి థ్యాంక్స్, ప్రతీ నిర్మాత, దర్శకుడిని ఇలాగే సపోర్టు చేయండి” అంటూ తేజస్వీ మీద ఒక వ్యంగాస్త్రాన్ని సంధించారు రోజులు మారాయి నిర్మాత శ్రీనివాస్.
దానికి స్పందనగా తేజస్వీ “నేను ప్రాడక్టుని తయారుచేయడాన్ని నమ్ముతాను, దాన్ని అమ్మడాన్ని కాదు, సినిమా బాగుంటే ఎవరైనా మెచ్చుకుంటారు.
రోజులు మారాయిలో నటించినందుకు సంతోషంగా ఉంది” అంటూ ట్వీట్ చేసింది.
దీంతో మరింత కోపానికి వచ్చిన శ్రీనివాస్ తేజస్వీని ఉద్దేశించి ” జూనియర్ ఆర్టిస్టులకి ఎక్కువ, హీరోయిన్ కి తక్కువ కొంతమంది.
వాళ్ళిచ్చే బిల్డప్ మామూలుగా ఉండదు.నమ్ముతుందట, నమ్ముతుంది .ఎదవ హాఫ్ బిట్ విగ్ వేసుకోని పుచ్చిపోయిన పుచ్చకాయ లాగా నువ్వు .నీ మొహము.పక్కకెల్లి ఆడుకోమ్మా” అంటూ తేజస్వీపై విరుచుకుపడ్డారు.