కొన్ని కొన్ని కాంబినేషన్ లు వింటే షాక్ కి గురి అవతారు ఎవరైనా.అలాంటి కాంబినేషన్ ఇప్పుడు రాబోతోంది.
గౌతం మీనన్ చేస్తున్న నాలుగు భాషల చిత్రం లో తెలుగు లోంచి హీరోగా సాయి ధరం తేజ ని తీసుకోవడం విశేషం.ఈ సినిమా ని తెలుగు, తమిళం , కన్నడం , మలయాళం లో తీస్తారు.
ఎంత సమయం పడుతుంది అనేది ఇంకా తెలియలేదు.అనుష్క – తమన్నాలు ఇప్పటికే కాల్షీట్లు కూడా ఇచ్చేశారని తెలిసింది.
సాయిధరమ్ తేజ్ కూడా గౌతమ్ మీనన్ ఎప్పుడంటే అప్పుడు రంగంలోకి దిగడానికి సిద్ధంగా ఉన్నాడు.
ఇటీవలే సాహసం శ్వాసగా సాగిపో ఆడియో వేడుకకి హాజరైన సాయిధరమ్ తేజ్ తనని గౌతమ్ మీనన్ ప్రేమకథలు ఎంతగా ప్రభావితం చేశాయో చెప్పాడు.
ఇంతలోనే ఆయనకి తన సినిమాలో నటించే ఛాన్సిచ్చేశాడు గౌతమ్.మొత్తంగా తేజు అదృష్టవంతుడే.