బాలీవుడ్ లో క్వీన్ సినిమాతో సంచలనాలు రేపిన కంగనా కథ ఇప్పుడు సౌత్ కు రానుంది.క్వీన్ సినిమాలో కంగన నటనకు అనేక ప్రశసంలే కాదు నేషనల్ అవార్డ్ కూడా వచ్చింది.
సినిమాను సౌత్ ప్రేక్షకులకు కూడా అందించేలా త్యాగరాజన్ సినిమా రీమేక్ హక్కులను తీసుకున్నారు.ప్రస్తుతం తమిళ్ లో నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిష నటిస్తుంది.
సీనియర్ నటి రేవతి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమా బాలీవుడ్ క్వీన్ కన్నా పెద్ద హిట్ అవుతుందని అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు.
ఓ పక్క నటిగా చేస్తూనే చాలా కాలం తర్వాత మెగా ఫోన్ పట్టిన రేవతి ఈ మహిళా ప్రాధాన్యత ఉన్న సినిమా తీసి మరోసారి తన సత్తా చాటబోతుంది.
ఇక ఈ సినిమాతో త్రిష ఖాతాలో మరో ప్రెస్టిజియస్ ప్రాజెక్ట్ చేరిందని చెప్పాలి.ఇప్పటికే త్రిష నటించిన నాయకి రిలీజ్ కు రెడీ అవుతుండగా.
అదే హారర్ కథా నేపథ్యంలో మేనక సినిమా కూడా చేస్తుంది.ఇప్పుడు కోలీవుడ్ క్వీన్ గా క్రేజీ సినిమా ఛాన్స్ కొట్టేసింది.
తెలుగులో హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమాలకు అనుష్క బెస్ట్ ఆప్షన్ కాగా అక్కడ నయనతార తర్వాత త్రిష ఆ అవకాశాలను కొట్టేస్తుంది.ఇక తమిళ సినిమాను తెలుగులో కూడా డబ్ చేసే అవకాశాలున్నాయి.
మరి సౌత్ క్వీన్ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలంటే సినిమా వచ్చేదాకా ఆగాల్సిందే.
.