సాక్షి పత్రిక కూడా మూసేయ్యబోతున్నారు ?

మీడియా వారు లేక ప్రతిపక్షాలు ఒక ప్రశ్న వేసినప్పుడు దానికి సమాధానం చెప్పకుండా వేరే విషయాల మీద సీరియస్ అవ్వడం ఒక్క తెలుగుదేశం పార్టీ వారికి మాత్రమే చెల్లుతుంది ఏమో.ఎందుకంటే ప్రజాస్వామ్యం లో ప్రశ్నించడమే పనిగా పెట్టుకున్న మీడియా మీద టీడీపీ వారు అవలంభించే వైఖరి వేరుగా ఉంటుంది.

 Sakshi Paper To Be Closed Soon-TeluguStop.com

సాక్షి ఛానల్ మీద ఇప్పటికే ఆంక్షలు పెట్టిన సంగతి తెలిసిందే.ఇప్పుడు సాక్షి పత్రిక మీద కూడా కోప్పడుతున్నారు దేవినేని ఉమా.

ఏపీ మంత్రి అయిన ఈయన కొండవీటి వాగు టెండర్ గురించి సాక్షి పేపర్ ప్రచురించిన కథనం గురించి ప్రస్తావిస్తున్న ఒక విలేఖరి తో సంబంధం లేకుండా మాట్లాడారు ” ఒక పక్క నీటి పారుదల ప్రాజెక్ట్ లని పూర్తి చెయ్యాలనే చంద్రబాబు కలని జగన్ అడ్డుకోవాలని చూస్తున్నారు , ఇది చాలా తీవ్రమైన పరిణామం.సమాజ వ్యతిరేకిగా జగన్ మారుతున్నారు.

మాన‌సిక రుగ్మ‌త‌తో జ‌గ‌న్ బాధ‌ప‌డుతున్నారు ” అంటూ ఆయన ఎద్దేవా చేసారు .ఆయన వైఖరి నచ్చకనే అందరూ ఆయన పార్టీ వదిలి వచ్చేస్తున్నారు అని చెప్పుకొచ్చారు ఉమ .అయితే కొండవీటి వాగు గురించే గానీ అక్కడ టెండర్ ల గురించి కానీ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు.అడిగిన దానికి సమాధానం చెప్పకుండా సాక్షి పత్రిక మూయిస్తాం అంటున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube