జూనియర్ ఎన్టీఆర్ సినీ మా అవార్డ్స్ లో బెస్ట్ హీరో గ అవార్డ్ అందుకున్న సంగతి తెలిసిందే.ఆ అవార్డ్ ని స్వయంగా చిరంజీవి అందించడం , ఆయన తన స్ఫూర్తి అనీ ఆయనతో పాటు నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ అందరి స్ఫూర్తి తో తాను ఈ స్థాయికి వచ్చాను అనీ వారితో పాటు సీనియర్ ఎన్టీఆర్ , అక్కినేని నాగేశ్వరరావు , కృష్ణ గార్ల ఆశీర్వాదాలు తమకి ఉన్నాయ్ అన్నాడు తారక్.
తమ జేనేరేషన్ అందరి మీదా పెద్ద హీరోల బ్లెస్సింగ్స్ ఉండాలి అనీ కోరుకున్నాడు ఎన్టీఆర్.ఇదంతా వారం క్రితం జరిగిన సినీ మా ఆవర్డ్స్ ఫంక్షన్ లో జరిగిన భాగోతం.
అయితే కట్ చేస్తే మొన్న ఆదివారం టీవీ లో ప్లే చేసిన మా అవార్డ్స్ లో ఎన్టీఆర్ మాటల్లో మొదట సీనియర్ ఎన్టీఆర్ పేరు వచ్చి ఆఖర్లో చిరంజీవి పేరు వచ్చింది.స్వయంగా ఎన్టీఆర్ అభిమానులే ఆయన అన్న మాటలని లైవ్ లో చూసి వీడియో తీసి మరీ ఇంటర్నెట్ లో పెట్టారు దానికి విరుద్ధంగా ఎడిట్ చేసిన వీడియో మా టీవీ లో ప్లే అయ్యింది.
ఇది పెద్ద గిమ్మిక్ అని చెబుతున్నారు.నందమూరి తారకరామారావు గారు.
అక్కినేని నాగేశ్వరరావు గారు.కృష్ణ గారు.
అనే పదాలను ముందుకు మార్చి.ఆ తరువాత చిరంజీవి బాలయ్య నాగ్ పేర్లను యాడ్ చేశారు.
అసలు ఈ గిమ్మిక్ ఎందుకు చేయాల్సి వచ్చింది? ఆనాటి స్పీచ్ ను షేర్ చేసిన ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఇప్పుడు ఈ గిమ్మిక్ చూసి షాకయ్యారు.ఎవరన్నా కావాలనే ఇలా స్పీచులో మార్పులు చేశారా? లేకపోతే ముందు చిరంజీవి పేరు చెబితే అభిమానులు ఫీలవుతారని స్వయంగా మా టివి యాజమాన్యం అలా డెసిషన్ తీసుకుందా? కాదు కాదు ఇప్పటికే బాలకృష్ణ కీ ఎన్టీఆర్ కీ మధ్య సయోధ్య లేదు అనీ అందుకే ఆయనకి భయపడి మార్చాడు అని కొందరు అంటున్నారు.