చంద్రబాబుపై మరోసారి నోరు పారేసుకుంటే .వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు.
జగన్కు ప్రజలే బుద్ధి చెపుతారని తెదేపా ఎమ్మెల్సీ పయ్యావుల కేశవ్ ధ్వజమెత్తారు.
శుక్రవారం ఆయనహైదరాబాద్లోని ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో మీడియాతో మాట్లాడుతూ.
తొలి నుంచి జగన్కు మానసిక పరిస్థితి సరిగా లేదని, ఇంట్లోవారితో ఇష్టాను సారం ప్రవర్తిస్తుండటంతో ఆతని తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గతంలో వైద్యం కోసం హైదరాబాద్లో కాకుండా బెంగళూరుకు పంపిన విషయం అందరికీ తెలిసిందేనని వ్యాఖ్యానించారు.తండ్రి అధికారాన్ని అడ్డు పెట్టుకుని సంపాదించిన ఆ జగన్ జైలుకి వెళ్లినా… ప్రవర్తనలో మార్పు రాలేదని, ఇంట్లో ఉన్న వారిని సరిగా చూసుకోలేని ఆయన రాష్ట్ర ప్రజలనేం చూసుకోగలడని అన్నారాయన.
ఇప్పటికే జగన్ వ్యవహారాలు నచ్చకే ఆ పార్టీ శాసన సభ్యులు తెలుగుదేశం పార్టీలో చేరుతుంటే భరించలేక, బెంబేలెత్తిపోతున్నారని విమర్శించారు.రెక్కలు విరిగిన ఫ్యాన్ను జగన్ ఓఎల్ఎక్స్లో అమ్మకానికి ఉంచుకోవచ్చని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.
పదే పదే.చంద్రబాబుపై నోరు పారేసుకుంటున్న జగన్ని రైతులు రాళ్లతో, యువత గొడ్డలతో, మహిళలు చీపురు కట్టలతో, వృద్ధులు చేతి కర్రలతో కొట్టడం ఖాయమని హెచ్చరించారు పయ్యవుల.