చావు రాసి పెట్టి ఉంటే ఎవరూ ఆపలేరు ! భూమి మీద నూకలు ఉంటే చావాలని ఎంత ప్రయత్నించినా అది విఫలం అవుతుంది.అదే విధి అంటే.
విధిరాతను ఎవరూ తప్పించుకోలేరు అనడానికి ఈ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం ఒక ఉదాహరణగా నిలుస్తోంది.రైలు కిందపడి ఆత్మహత్య చేసుకుందామని వెళ్లిన 20 ఏళ్ల యువతిని ఆమె వేసుకున్న బట్టలు రక్షించిన ఘటన అందరిని ఆశ్చర్యపరుస్తోంది.
తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేశముద్రం గ్రామం పెద్ద చెరువు వద్ద మంగళవారం చోటు చేసుకునన్న ఘటన పూర్తి వివరాలను పరిశీలిస్తే హైదరాబాద్లోని ఎర్రగడ్డ నివాసి అయిన ఒక యువతీ ఆత్మహత్య చేసుకోడానికి కేశముద్రం రైల్వే ట్రాక్ మీద నడుస్తూ యువతి విజయవాడ నుంచి సికింద్రబాద్ వెళ్తున్న శాతవాహన రైలు కింద పడేందుకు ప్రయత్నించింది.అయితే, ఆమె వేసుకున్న టీషర్ట్ వల్ల ప్రాణాలతో బయటపడింది.ఆమె ఎర్ర టీషర్ట్ ధరించడంతో రైల్వే డ్రైవర్ దూరం నుంచే ఆమెను పసిగట్టాడు.ఏదో ప్రమాదం పొంచివుందని భావించి రైలు ఆపాడు.దీంతో, అక్కడి స్థానికులు కూడా హుటాహుటిన పట్టాల వద్దకు వెళ్లి ఆమెను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.సమయానికి బ్రేకులు వేసి రైలు ఆపిన లోకో పైలెట్ను అభినందించారు.