టాలీవుడ్ మాస్ మహారాజా గా పేరు తెచ్చుకున్న రవితేజ ఏడాదికి మూడు నాలుగు సినిమాలను విడుదల చేస్తూ బిజీగా ఉంటాడు.ఒక సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా అనౌన్స్ చేయడం రవితేజకు మొదటి నుండి అలవాటు.
హిట్ ప్లాప్ తో సంభంధం లేకుండా వరస పెట్టి సినిమాలు చేస్తూ ఉంటాడు.తాజాగా రవితేజ క్రాక్ సినిమాతో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చిన విషయం తెలిసిందే.
చాలా రోజులుగా వరస ప్లాపులతో సతమతమవుతున్న రవితేజ ఎట్టకేలకు సంక్రాంతికి రిలీజ్ అయిన క్రాక్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో మళ్ళీ ఫామ్ లోకి వచ్చాడు.ప్రస్తుతం రవితేజ రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడీ సినిమా చేస్తున్నాడు.
ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది.అయితే రవితేజ ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే మరొక సినిమా ప్రకటించాడు.
శరత్ మండవ అనే కొత్త దర్శకుడుతో ఒక సినిమా చేస్తున్నట్టు ప్రకటించాడు.ఇది వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న పీరియాడిక్ డ్రామా.ఈ సినిమా 1990 బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుందని సమాచారం.ప్రస్తుతం టాలీవుడ్ లో పీరియాడిక్ సినిమాలు ఎక్కువుగా వస్తున్నాయి.
ఇప్పుడు రవితేజ కూడా అలంటి సినిమాతోనే రాబోతున్నాడు.
ఈ సినిమాలో రవితేజ 25 సంవత్సరాల వెనుకకు తీసుకెళ్ళబోతున్నాడట.ఈ సినిమాలో డైరెక్టర్ కొన్ని సుర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ను చూపించబోతున్నాడని తెలుస్తుంది.ఇప్పటికే 1990 బ్యాక్ డ్రాప్ కోసం కొన్ని సెట్టింగ్స్ కూడా వేయిస్తున్నారని టాక్.
మొత్తానికి రవితేజ ప్రేక్షకులను ఒక కొత్త కథతో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ఎస్.ఎల్.వి సినిమా పతాకంపై సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.ఈ సినిమాలో రవితేజకు జోడీగా దివ్యాంశ కౌశిక్ హీరోయిన్ గా నటించబోతుంది.