కొందరు బాలా మేధావులు ఈ సామెత మాదిరిగానే ఉంటారు.చిన్న వయసులోనే ‘ఔరా’ అని ముక్కున వేలేసుకునేవిధంగా ఘన కార్యాలు సాధిస్తూ ఉంటారు.
అలాంటి ఓ పిట్ట తెలంగాణలో ఘనమైన కూత కూసింది.రాష్ర్టంలో పదో తరగతి పరీక్షల ఫలితాలు ఈ రోజే (ఆదివారం) విడుదలయ్యాయి.
ఈ ఫలితాల్లో ఓ బుడతడికి ఏడు పాయింట్ ఐదు గ్రేడ్ వచ్చింది.ఇంతకూ ఇతని వయసు ఎంతో తెలుసా? కేవలం తొమ్మిదేళ్లు.పేరు అగస్త్య.పురాణాల్లో అగస్త్యుడు సముద్రాన్ని తాగేశాడంటారు.ఈ తరం అగస్త్యుడు పదో తరగతి సిలబస్ను నూరుకొని తాగేశాడు.చాంద్రాయణ గుట్టలోని సెయింట్ హిల్్స హైస్కూలులో పదో తరగతిలో చేరినప్పుడు ఈ బాబు వయసు ఎనిమిదేళ్ల పది నెలలు.
పుట్టడమే చాకులాంటి తెలివితేటలతో పుట్టాడేమో.తల్లిదండ్రులు కూడా ఆ అబ్బాయి తెలివితేటలు గ్రహించి అన్నివిధాల ప్రోత్సహించారు.
అయితే ఒక్కోసారి ఇంత తెలివి ఉన్న పిల్లలు కూడా ఉన్నత చదువుల్లో, లేదా పోటీ పరీక్షల్లో ఫెయిల్ అవుతారు.పదో తరగతిలో రాష్ర్ట స్థాయిలో ర్యాంకు తెచ్చుకున్నవారు ఎంసెట్లో బోల్తా పడిన ఘటనలు ఉన్నాయి.
అగస్త్య ఈ జాబితాలో ఉండకూడదని ఆశిద్దాం.