యూపీ లో అత్యాచారాల పర్వం కొనసాగుతూనే ఉంది.ఒకపక్క ఇటీవల చోటుచేసుకున్న హత్రాస్ ఘటన గురించి ఒకపక్క పోరాటం కొనసాగుతుండగానే తాజాగా మరో పాశవిక సంఘటన చోటుచేసుకుంది.
ఎదో పక్కింటి వాడే కదా అని నమ్మి 8 ఏళ్ల చిన్నారి ని ఇంటికి పంపిస్తే అతడు దారుణానికి పాల్పడ్డాడు.ఈ ఘటన యూపీ లోని అజమ్ ఘడ్ జిల్లా లో చోటుచేసుకుంది.వివరాల్లోకి వెళితే….దినేష్(20) అనే యువకుడు తన ఇంటిపక్కనే ఉన్న 8 ఏళ్ల చిన్నారి కి స్నానం చేయిస్తాను అని చెప్పి ఇంటికి తీసుకువెళ్లాడు.అయితే ఎదో పక్కింటి పిల్లోడే కదా అని ఆ తల్లి నమ్మి అతడి వెంట బిడ్డను ఇచ్చి పంపిస్తే ఆ కామాంధుడు చిన్నారి అన్న జ్ఞానం కూడా లేకుండా దారుణంగా ఆ చిన్నారిపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు.
అయితే కొద్దీ సేపటి తరువాత ఆ చిన్నారి ఏడుస్తూ ఇంటికి చేరుకుంది.
అయితే అప్పటికే రక్తస్రావం అవుతుండడం తో వెంటనే ఆ చిన్నారిని ఆసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు ఆ చిన్నారిపై లైంగిక దాడి జరిగిన విషయాన్ని నిర్ధారించారు.దీనితో విషయం తెలుసుకున్న ఆ తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయడం తో కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు.
మరోపక్క ఆ చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తుంది.ఎదో పక్కింటి వాడే కదా అని నమ్మి 8 ఏళ్ల చిన్నారిని అప్పగిస్తే ఆ కామాంధుడు ఇలాంటి దారుణానికి ఒడిగట్టాడు అంటూ ఆ తల్లి తల్లడిల్లిపోతుంది.
ఇప్పటికే ఇటీవల చోటుచేసుకున్న హత్రాస్ ఘటన పై పెద్ద దుమారమే రేగుతుంది.నిందితులను కఠినంగా శిక్షించాలని పలువురు డిమాండ్ చేస్తూ ఆందోళనలు కూడా చేస్తున్నారు.
ఇలాంటి సమయంలో యూపీ లోనే మరో అత్యాచార ఘటన చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగిస్తుంది.ఇటీవల యూపీ లో అత్యాచార ఘటనలు ఎక్కువగా చోటుచేసుకుంటుండడం తో ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై మండిపడుతున్నాయి.
ఇలాంటి దారుణాలు జరగకుండా చూడాలి అంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నాయి.