దేశ వ్యాప్తంగా కరోనా శరవేగంగా విస్తరిస్తోంది.లాక్ డౌన్ లో అన్ని షాపులు బంద్ అయ్యాయి.
అందులో మద్యం షాపులు కూడా ఒకటి.మద్యం షాపులు మూసివేత మద్యం ప్రియులు లాక్ డౌన్ లో అల్లాడిపోయారు.అన్ లాక్ 3.0 ప్రక్రియ ప్రారంభం కావడంతో ప్రభుత్వం వైన్ షాపులను తెరిచింది.కానీ, కొన్ని రాష్ట్రాల్లో కరోనా నేపథ్యంలో మద్యం షాపులు మూసిఉంచారు.
దీంతో అక్రమార్కుల ఆగడాలకు అంతు లేకుండా పోయింది.
వేరే ప్రాంతాల నుంచి కల్తీ మద్యాన్ని సేకరించి అమ్ముతున్నారు.అక్రమంగా ఆదాయం సంపాదించేందుకు మద్యాన్ని కల్తీ చేసి తక్కువ ధరకు అమ్ముతుంటారు.
తక్కువ ధరకే కల్తీ మద్యం సేవించి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
కల్తీ మద్యం సేవించి ఏకంగా 86 మంది మరణించిన ఘటన పంజాబ్ లోని అమృత్ సర్ లో చోటు చేసుకుంది.
రెండు రోజుల్లోనే 86 మంది మృత్యువాత పడటంతో ప్రభుత్వం సీరియస్ అయింది.దీంతో కల్తీ మద్యం తయారు చూస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవడానికి రంగం సిద్ధం చేసింది.
విచారణ చేపట్టిన పోలీసులు ఇప్పటికే కల్తీ మద్యం తయారీదారులకు సహకరించిన కొందరు అధికారులను సస్పెండ్ చేసి జ్యూడిషియల్ ఎంక్వైరీకి తరలించారు.ప్రభుత్వం కల్తీ మద్యం సేవించి చనిపోయిన 86 మంది కుంటుంబానికి రూ.2 లక్షల ఎక్స్ గ్రేషియా అందించనుంది.