ఈ మధ్యకాలంలో జరిగే కొన్ని ఘటనలు చూస్తుంటే కరోనా వైరస్ కు భయపడాల్సిన అవసరం లేదు అనిపిస్తుంది.కరోనా వైరస్ కు ఎక్కువ 60 ఏళ్ళపై వాళ్ళే బలవుతున్నారు అన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
కానీ నూరేళ్లపైబడిన వారు కూడా కరోనా నుండి కోలుకుంటున్నారు.
ఇంకా ఈ నేపథ్యంలోనే ఒడిషాలోని 85 ఏళ్ళ క్యాన్సర్ రోగి ఒకరు కరోనా వైరస్ పై విజయం సాధించాడు.
ఇంకా ఈ వైరస్ బారిన పడిన అతని భార్య(78) కూడా కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకుంది.పూర్తి వివరాల్లోకి వెళ్తే.ఒడిషాలోని సురేంద్ర పతి అనే వృధ్ధుడు గొంతు క్యాన్సర్ తో బాధ పడుతున్నాడు.
ఇంకా అతనికి, అతని భార్య సావిత్రికి ఇద్దరికి కరోనా వైరస్ పాజిటివ్ వచ్చింది.
దీంతో ‘కటక్’లోని ఆచార్య హరిహర్ రీజనల్ క్యాన్సర్ ఆసుపత్రిలో గత నెల 8వ తేదీన ఇద్దరు చేరారు.అప్పటి నుండి వైద్యులు అతనికి ఖీమోథెరపీ, ఇతర వైద్య చికిత్సలు అందించారు.
దీంతో అతను కరోనా వైరస్ నుండి పూర్తిగా కోలుకున్నాడు.అతని భార్య కూడా కరోనాపై విజయం సాధించింది.
దీంతో భార్యాభర్తలిద్దరిని వైద్యులు డిశ్చార్జి చేశారు.కాగా ఇటీవలే 103 వృద్ధురాలు కూడా కరోనా వైరస్ పై విజయం సాధించిన సంగతి తెలిసిందే.