ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని తెలంగాణ రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు ఇటీవలే ప్రభుత్వ విద్యాధికారులు అధికారికంగా ప్రకటన చేశారు.దీంతో తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో హైదరాబాద్ నగరానికి చెందినటువంటి 82 సంవత్సరాలు కలిగిన ఓ వృద్ధుడు 46 సార్లు పదోతరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడని, కానీ ఈసారి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పదో తరగతి పరీక్షలను రద్దు చేయడంతో పాస్ అయ్యాడని పలు వార్తలు తెగ వైరల్ అవుతున్నాయి.
అయితే ఈ విషయం పై కొంత మంది నెటిజన్లు స్పందిస్తూ 82 సంవత్సరాలు కలిగినటువంటి వృద్ధుడు పదో తరగతి పరీక్షలను 47 సార్లు రాసి ఫెయిల్ అయిన మాట వాస్తవమేనని కానీ తెలంగాణ రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదని రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన శివ చరణ్ యాదవ్ అని అంటున్నారు.అలాగే శివ చరణ్ యాదవ్ చివరిగా 2016వ సంవత్సరంలో పదో తరగతి పరీక్షలు రాసి ఫెయిల్ అయ్యాడని అంటున్నారు.
అయితే ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం ఉన్నటువంటి కరోనా వైరస్ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని పదో తరగతి పరీక్షలను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది.మరోవైపు రాష్ట్రంలోని పలువురు ప్రజా సంఘ నాయకులు కూడా ఈ విషయాన్ని తప్పుపడుతున్నారు.
అంతేకాక విద్యార్థి దశలో పదో తరగతి పరీక్షలు ఎంతో కీలకమైనదని కాబట్టి కొంచెం ఆలస్యమైనా సరే పదో తరగతి పరీక్షలు కచ్చితంగా నిర్వహించాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నారు.