గ్రామంలో పెళ్లి చేసుకోకుండా 80 ఏళ్ల ఓ వ్యక్తి 50 ఏళ్ల మహిళ ఇద్దరూ 20 ఏళ్లుగా సహజీవనం చేస్తున్నారు.వారికి13 ఏళ్ల కుమారుడు కూడా ఉన్నాడు.ఇన్నేళ్లుగా సహజీవనం చేస్తున్న పెళ్లి చేసుకోవాలనే ఆలోచన ఇద్దరికీ రాలేదట.ఇంత వయసు వచ్చాక మరి ఇప్పుడు పెళ్లి ఏంటి అనుకుంటున్నారా.! పెళ్లి చేసుకోవడానికి కారణం ఆ గ్రామస్తులు పట్టుబట్టి మరియు వివాహం జరిపించారట.వివరాల్లోకి వెళితే. ఉత్తరప్రదేశ్ లోని రసూల్ పూర్ గ్రామానికి చెందిన నారాయణ్, రామ్ రతి పెళ్లి చేసుకోకుండా 2001 నుంచి సహజీవనం చేస్తున్నారు.2008లో ఒక కొడుకు పుట్టాడు.అయితే గ్రామస్తులు ఎప్పటి నుంచో వీరి బంధాన్ని తప్పుబడుతూ వారిని పెళ్లి చేసుకోవాలంటు తెచ్చార చేస్తున్నారు.అలాగే వారి కుమారుడు కూడా ఈ సమాజంలో గౌరవంగా బతకాలంటే పెళ్లి చేసుకోవాలని గ్రామాల్లో నాకు ఇబ్బందులకు గురిచేస్తున్నారని, సూటి పోటి మాటలు మాట్లాడుతున్నారని సమాజంలో నాకు గౌరవం ఉండాలి అంటే మీరు పెళ్లి చేసుకోవాలని కొడుకు ఒత్తిడి మేరకు ఆ వృద్ధులు కుమారుని కోసం పెళ్లి కి అంగీకరించారు.
దంపతులు పెళ్లికి ఒప్పుకోవడంతో గ్రామస్తులే చందాలు వేసుకుని మరి అంగరంగ వైభవంగా వీరి పెళ్లి జరిపించారు.ఈ పెళ్లితో గ్రామస్తులు తో పాటు కుమారుడు కూడా చాలా సంతోషంగా ఫీల్ అయ్యాడు.