చేతబడి అంటూ 80 ఏళ్ల వృద్ధుడిని దారుణంగా చంపేశారు!

కాలం మారుతున్న సమయం మారడం లేదు.ఎన్ని ఏళ్ళు వచ్చిన సరే క్షుద్ర పూజలు అంటూ మనుషులను చంపుతున్నారు.

 80 Year Old Man Brutally Murdered Due To Black Magic, Black Magic, Meghalaya, O-TeluguStop.com

ఇక అలానే క్షుద్ర పూజలు చేస్తున్నాడనే నెపంతో 80 ఏళ్ల వృద్ధుని అతి కిరాతకంగా బ్రతికుండగానే పూడ్చి పెట్టిన హృదయ విదారక ఘటన మేఘాలయాలో చోటుచేసుకుంది.విషయం తెలుసుకున్న పోలీసులు శవాన్ని వెలికితీసి పోస్టుమార్టం జరిపించారు.

అయితే పోలీసులు తెలిపిన వివరాల మేరకు…

మేఘాలయ లోని పశ్చిమ కాశీ హిల్స్ ప్రాంతానికి చెందిన మోరిస్ మారంగర్ అనే 80 సంవత్సరాల వృద్ధుడు చేతబడి, క్షుద్ర పూజలు చేస్తున్నాడనే నెపంతో వారి బంధువులు అతడిని కాళ్లు చేతులు కట్టేసి బతికుండగానే గోతిలో పూడ్చి పెట్టారు.ఇంట్లో తమ పిల్లలు తమ తండ్రి ఎంతసేపటికీ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ఈ కేసులో దర్యాప్తు కొనసాగిస్తున్న తరుణంలో వారి బంధువుల పై అనుమానం కలగడంతో, మోరిస్ మేనల్లుడు డేనియల్, జేమ్స్, తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకోగా, అతని మేనల్లుడు మెమోరీస్ క్షుద్ర పూజలు చేయడం వల్ల మా కుటుంబం ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నా మన్నారు.తమ సోదరి పై చేతబడి చేయడం ద్వారా ఆమె ఆరోగ్యం చాలా క్షీణించిందని, అతను మరణించిన తర్వాత తిరిగి ఆమె కోలుకుఉంటుందని అందుకే అతను ఇలా సజీవదహనం చేశామని పోలీసులు దగ్గర వెల్లడించారు.

ఈ కేసును దర్యాప్తు చేసి ఎనిమిది మంది నిందితులను అరెస్టు చేశారు.మోరిస్ శవాన్ని వెలికితీసి శవాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

అయితే ఈ కేసును మరింత లోతుగా దర్యాప్తు చేపట్టి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.ఇలాంటి క్షుద్ర పూజలు, చేతబడులు చేస్తే వారిపై పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసులు చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా తెలియజేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube