భారత్ లో ఎనిమిది యూట్యూబ్ ఛానళ్లను బ్లాక్ చేస్తూ కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.దేశ భద్రత, విదేశీ వ్యవహరాలపై తప్పుడు ప్రచారం చేసిన నేపథ్యంలో బ్లాక్ చేసినట్లు కేంద్రం ప్రకటించింది.
బ్లాక్ చేసిన ఛానళ్లలో 7 భారత్ కు చెందినవి కాగా, ఒక ఛానల్ పాకిస్తాన్ కు చెందినదిగా సమాచారం.ఈ 8 యూట్యూబ్ ఛానల్స్.
దాదాపు 86 లక్షల మంది సబ్స్క్రైబర్లు, 114 కోట్ల మంది వ్యూస్తో అకౌంట్లను కలిగి ఉన్నాయి.కాగా, ఈ ఛానల్స్ భారతదేశంలోని మత వర్గాల మధ్య ద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేంద్రం గతంలో కూడా ఐటీ రూల్స్ ను ఉల్లంఘిస్తున్నారన్న కారణాలతో 22 యూట్యూబ్ ఛానెల్స్, మూడు ట్విట్టర్ అకౌంట్స్, ఓ ఫేస్ బుక్ అకౌంట్, ఒక వార్తా వెబ్ సైట్ను బ్లాక్ చేసిన విషయం తెలసిందే.గత ఏడాది డిసెంబర్ నుండి సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తున్న అకౌంట్ల సంఖ్య తాజాగా 102కి చేరుకుంది.