విధి నిజంగా ఎంతో విచిత్రమైనది.అలాగే క్రూరమైనది కూడా.
దానికి చిన్నా, పెద్దా అనే తేడా తెలియదు.పేదలు, ధనికులు అనే భేదా భావం అసలే ఉండదు.
ఒక్కో సారి ఎంతో క్రూరాతి క్రూరంగా ప్రవర్తిస్తుంది.పగ వారు కూడా అయ్యో పాపం అనుకునే దారుణమైన స్థితిలోకి నెట్టి వేస్తుంది.
అది ఎప్పుడు, ఎలాంటి పరిస్థితిని తెచ్చి పెడుతుంది అనేది ఏమాత్రం తెలియదు.మధ్య ప్రదేశ్ లోని మురైనాలో విధి ఓ కుటుంబాన్ని చిధిమేసింది.
ఎంతలా అంటే.ఆ పరిస్థితి గురించి విన్న వారు ఎవరైనా కంట తడి పెట్టుకునేలా.
మురైనా జిల్లా అంబాహ్ మండలం బడ్ ఫరా గ్రామానికి చెందిన పూజారామ్ జాటవ్ కు నలుగురు సంతానం.మూడు, నాలుగు నెలల క్రితం అతని భార్య ఇల్లు వదిలి వెళ్లి పోయింది.
అప్పటి నుండి ముగ్గురు కొడుకులను, కూతుర్ని పూజారామ్ ఒక్కడే చూసుకుంటున్నాడు.
రెండేళ్ల చిన్న కుమారుడికి కొంత కాలంగా ఆరోగ్యం బాగోలేదు.
రక్త హీనత, కడుపులో నీరు చేరడం వంటి సమస్యలతో బాధపడుతున్నాడు.అంబాహ్ ఆస్పత్రి వైద్యులు.
మెరుగైన చికిత్స కోసం మురైనా జిల్లా ఆస్పత్రికి వెళ్లాలని సూచించారు.ఓ అంబులెన్స్ లో ఆస్పత్రికి వచ్చాడు పూజారామ్.
చికిత్స అందించినా ఫలితం లేదు.పిల్లాడు ప్రాణాలు కోల్పోయాడు.
పూజా రామ్, అతడితో పాటు వచ్చిన 8 ఏళ్ల పెద్ద కుమారుడు తీవ్ర విషాదంలో మునిగి పోయారు.మృతదేహంతో ఆస్పత్రికి బయటకు వచ్చి.
ఇంటికి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.అయితే.
వారిని స్వగ్రామం నుండి మురైనాకు తీసుకొచ్చిన అంబులెన్స్ అప్పటికే వెళ్లి పోయింది.మరో వాహనం కోసం ప్రయత్నిస్తే.డ్రైవర్ రూ.1500 అడిగాడు.అంత సొమ్ము లేని అతడు.కాస్త తక్కువ ధరలో ఏమైనా దొరుకుతుందేమోనని వెతకడం ప్రారంభించాడు.

పెద్ద కుమారుడ్ని ఆస్పత్రి బయట రోడ్డు పక్కనే కూర్చోబెట్టి, అతడి ఒడిలో మృత దేహాన్ని పెట్టాడు.తమ్ముడు పోయాడన్న బాధ తప్ప పేద రికం కష్టాలల గురించి తెలియని పెద్ద కుమారుడు.ఒడిలో మృత దేహంతో అలాగే గంటల పాటు కూర్చున్నాడు. ఓ బాబు తన తమ్ముడి మృత దేహంతో అలా కూర్చొని ఉండటం చూసి అక్కడి వారు చలించి పోయారు.
ఈ విషయం పోలీసులకు చేరడంతో పోలీసులు కాసేపయ్యాక అక్కడికి వచ్చారు.వారు వచ్చి చిన్నారి మృతదేహాన్ని ఆ బాబును పోలీసు స్టేషన్ కు తీసుకు వచ్చారు.ఈ లోగా పూజా రామ్ వచ్చి.అంబులెన్స్ ఏర్పాటు చేసి.
తన చిన్న కొడుకు మృత దేహాన్ని స్వస్థలానికి పంపించారు.