దేశంలో పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు ప్రకటించిన కేంద్రం..!!

తాజాగా కేంద్ర ప్రభుత్వం దేశంలో పలు రాష్ట్రాలకు ఎనిమిది మంది కొత్త గవర్నర్ పేర్లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది.ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు విశాఖ మాజీ ఎంపీ కంభంపాటి హరిబాబు కి గవర్నర్ గిరి లభించింది.

 8 States New Governors Appointed Central Janasena, Pawan Kalyan, Governors, Bjp,-TeluguStop.com

మిజోరం రాష్ట్రానికి కొత్త గవర్నర్ గా కంభంపాటి హరిబాబు నియమితులయ్యారు.ఇక ఇదే రీతిలో హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ గా ఉన్న బండారు దత్తాత్రేయ ని హర్యానాకు బదిలీ చేయడం జరిగింది.

కర్ణాటక గవర్నర్‌గా థావర్‌చంద్‌ గెహ్లాట్‌, గోవా గవర్నర్‌గా శ్రీధరన్‌ పిళ్లై (మిజోరాం ప్రస్తుత గవర్నర్‌), హిమాచల్‌ప్రదేశ్‌ గవర్నర్‌గా రాజేంద్రన్‌ విశ్వనాథ్‌, మధ్యప్రదేశ్‌ గవర్నర్‌గా మంగూబాయి చగన్‌భాయ్‌ పటేల్‌, త్రిపుర గవర్నర్‌గా సత్యదేవ్‌ నారాయణ్‌ ఆర్య, జార్ఖండ్‌ గవర్నర్‌గా రమేష్‌ బయాస్‌ వంటి వారిని గవర్నర్ నియమిస్తూ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఉత్తర్వులు జారీ చేశారు.ఈ సందర్బంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మిజోరం గవర్నర్ గా నియమితులైన కంభంపాటి హరిబాబుకు, బండారు దత్తాత్రేయకు శుభాకాంక్షలు తెలిపారు.

 

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube